ఏఎం రత్నం, పవన్ కళ్యాణ్ ల కలయికలో మరో సినిమా
- September 30, 2016
ఇప్పుడున్న తరాన్ని 'మీకు బాగా ఇష్టమైన సినిమాలు ఏవి '? అని అడిగితే సమాధానంగా చెప్పే వాటిలో 'ఖుషి' పేరు తప్పకుండా ఉంటుంది. అక్కడితో ఆగకుండా, ఆ సినిమా జ్ఞాపకాలన్నీ చెప్పేస్తారు. చాలా మంది యువతకు 'ఖుషి' ఓ మరిచిపోలేని అనుభవం. పవర్ స్టార్ మేనియా తెలుగు యువతను ఊపేస్తున్న రోజుల్లో వచ్చిన ఈ సినిమా అంచనాలను మించిన ప్రభంజనం సృష్టించింది. ఏడాది పాటు థియేటర్లు 'ఖుషి' చేసుకున్నాయి. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ అందనంత ఎత్తుకు వెళ్లిపోయారు. 'ఖుషి' నిర్మాత ఏఎం రత్నం 'బంగారం' తర్వాత మరోసారి పవర్ స్టార్ తో సినిమా చేయబోతున్నారు. ఏఎం రత్నంతో సినిమా చేయాలని పవన్ చాలా కాలంగా అనుకుంటున్నారు. ఇప్పటికి ఈ ప్రాజెక్ట్ రూపు దాల్చుతోంది. తమిళంలో విజయ్, మోహన్ లాల్ తో 'జిల్లా' సినిమాను తెరకెక్కించిన దర్శకుడు నీసన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశాలున్నాయి.
వేగం పెంచిన పవర్ స్టార్ : రెండు, మూడేళ్ల కో సినిమా చేసే పవన్ కళ్యాణ్..ఇలా అయితే కష్టమ ని భావిస్తున్నారు. ఏడాదిలో కనీసం రెండు సినిమాలైనా చేయాలని నిర్ణయించుకు న్నట్లున్నారు. ప్రస్తుతం కిషోర్ పార్థసాని దర్శకత్వంలో 'కాటమరాయుడు' లో నటిస్తున్న పవన్, ఇటీవలే రెగ్యులర్ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. దీంతో పాటే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చర్చల దశలో ఉంది. మరోవైపు దాసరి నారాయణ రావు నిర్మాణంలో మరో చిత్రానికి గతంలోనే అంగీకారం తెలిపాడు. ఇప్పుడు శ్రీ సూర్యా మూవీస్ లో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు పవన్.
తాజా వార్తలు
- అమెరత్–బౌషర్ మౌంటేన్ రోడ్ రెండు రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో MoHRE ఫీజులు, ఫైన్స్ ఈఎంఐల్లో చెల్లించే అవకాశం..!!
- గోల్డ్ ట్రేడ్ మనీలాండరింగ్పై కువైట్ స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ పాస్పోర్ట్ తో 112 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశం..!!
- సౌదీ–యూఏఈ బంధాలు మరింత బలోపేతం..!!
- ఆసుపత్రిలో మహిళ మృతిపై దర్యాప్తు ప్రారంభం..!!
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..







