రజనీకాంత్ కూతురుదర్శకత్వంలో ఓ డాక్యుమెంటరీ..
- October 02, 2016
సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురుగా, హీరో ధనుష్ భార్యగా ఐశ్వర్య ధనుష్ సినీ అభిమానులకు సుపరిచితురాలే. అయితే తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్న ఈ స్టార్ వారసురాలు, ప్రస్తుతం దర్శకురాలిగా నిలదొక్కుకునేందుకు కష్టపడుతోంది. ఇప్పటికే ధనుష్ హీరోగా 3 సినిమాను డైరెక్ట్ చేసిన ఐశ్వర్య ఆ సినిమాతో ఆశించిన స్థాయి విజయం సాధించలేకపోయింది. ప్రస్తుతం సినిమా నేపథ్యంలో ఓ డాక్యుమెంటరీ చిత్రాన్ని రూపొందించే పనిలో బిజీగా ఉంది.సినీ రంగంలోని 24 శాఖల్లో ఒకటైన స్టంట్ డైరెక్టర్ ల కష్టాలు, వారి జీవనశైలి, వారికి ఉన్న ఇబ్బందుల నేపథ్యంలో సినిమా వీరన్ పేరుతో ఓ డాక్యుమెంటరీ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది ఐశ్వర్య.తానే స్వయంగా నిర్మిస్తూ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి సూపర్ స్టార్ రజనీకాంత్ వాయిస్ ఓవర్ అంధిస్తుండగా, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ నేపథ్యం సంగీతం అందిస్తున్నాడు. త్వరలో రిలీజ్ చేయనున్న ఈ డాక్యుమెంటరీని కేంద్ర ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాండ్ కాస్టింగ్ మినిస్టర్ వెంకయ్య నాయుడుకు చూపించిన ఐశ్వర్య, ఇన్నాళ్లుగా జాతీయ అవార్డుల్లో ఫైట్ మాస్టర్ క్యాటగిరీ లేకపోవటంపై విచారం వ్యక్తం చేశారు. ఈ ఏడాది నుంచి ఫైట్ మాస్టర్లకు కూడా జాతీయ అవార్డును అందించాలని కేంద్రాన్ని కోరారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







