గుంటూరులో స్వరస్వతి పురస్కారాన్ని అందుకోవడం పూర్వజన్మ సుకృతం : గీతా మాధురి
- October 02, 2016
ఎందరో కళాకారులు జన్మించిన గుంటూరులో స్వరస్వతి పురస్కారాన్ని అందుకోవడం పూర్వజన్మ సుకృతం అని గాయని గీతా మాధురి అన్నారు. గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో కళాదర్బార్ అమరావతి, ఠాగూర్ మెమోరియల్ థియేటర్ ట్రస్ట్ సంయుక్త ఆధ ్వర్యంలో ఆదివారం గాయని గీతామాధురికి స్వరసరస్వతి పురస్కారం ప్రదానం చేశారు. సభకు కళాదర్బార్ అధ్యక్షుడు పొత్తూరి రంగారావు అధ్యక్షత వహించారు. పురస్కార గ్రహీత గీతామాధురి మాట్లాడుతూ పదేళ్లుగా గాయనిగా ఎదగడానికి అభిమానుల ప్రోత్సాహమే కారణమన్నారు. కళాకారులను గుర్తించి ఆదరిస్తున్న కళాదర్బార్ సంస్థ కళాసేవ అభినందనీయమన్నారు. సభలో ఎంపీ రాయపాటి సాంబశివరావు, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్, మార్కెట్ యార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు, టీడీపీ నాయకులు మద్దాళి గిరిధర్, జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ బూసిరెడ్డి మల్లేశ్వరరెడ్డి, గంటా పున్నారావు, బిజిలేపల్లి మోహనరావు తదితరులు గీతామాధురిని స్వర సరస్వతి పురస్కారంతో సత్కరించారు.అలరించిన సినీ సంగీత విభావరి గాయని గీతామాధురి, రేఖ, పూజ, అమ్మపండు, రమణలు తమ గాత్ర ధారణలో పలు గీతాలను ఆలపించారు. కీబోర్డుపై అశోక్, తబలపై విజయపాల్, పాడ్స్ చంద్ర, రవి, జాజ్పై సూరి వాద్య సహకారం అందించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







