తెలంగాణ లో ముచ్చటగా 30 జిల్లాలు!
- October 03, 2016
తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు కసరత్తు తుది దశకు చేరుకుంది. క్షేత్రస్థాయి పరిస్థితులు, డిమాండ్లపై నేతల అభిప్రాయాలు తెలుసుకునేందుకు జిల్లాల వారీగా నేతలతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించారు. ఈరోజు కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం, హైదరాబాద్ జిల్లా నేతలతో ముఖ్యమంత్రి చర్చించారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై నాయకుల్లో ఏకాభిప్రాయం వ్యక్తమైందని కేసీఆర్ అన్నారు. 30 జిల్లాల ఏర్పాటుకు అనుగుణంగా కసరత్తు జరపాలని నిర్ణయించినట్లు చెప్పారు. కొత్తగూడెం కేంద్రంగా ఏర్పడే జిల్లాకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాగా పేరు, వికారాబాద్ కేంద్రంగా ఏర్పడే జిల్లాకు వికారబాద్ పేరు, మహబూబాబాద్ జిల్లా పేరును అలాగే కొనసాగించాలని సీఎం పేర్కొన్నారు.
సిరిసిల్ల కేంద్రంగా ఏర్పడే జిల్లాకు రాజన్న పేరు పెట్టాలనే ప్రతిపాదన ఉన్నట్లు చెప్పారు.
పెద్దపల్లి నగరపంచాయతీని మున్సిపాలిటీగా మార్చాలని, వరంగల్ గ్రామీణ జిల్లా కేంద్రాన్ని కూడా వరంగల్ నగరంలోనే ఏర్పాటు చేయాలని, స్టేషన్ఘన్పూర్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మూడు జిల్లాల ప్రతిపాదనలపై కసరత్తు చేయాలని.. కేశవరావు కమిటీ నివేదిక తెప్పించుకుని తుది నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ వెల్లడించారు.
2019 ఎన్నికల్లోనూ తెరాస గెలుస్తుందని ప్రతిపక్షాలు అంటున్నాయని.. కావున మన ప్రణాళిక రాబోయే ఏడెనిమిదేళ్ల కోసం జరగాలని కేసీఆర్ అన్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









