తెలంగాణ లో ముచ్చటగా 30 జిల్లాలు!
- October 03, 2016
తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు కసరత్తు తుది దశకు చేరుకుంది. క్షేత్రస్థాయి పరిస్థితులు, డిమాండ్లపై నేతల అభిప్రాయాలు తెలుసుకునేందుకు జిల్లాల వారీగా నేతలతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించారు. ఈరోజు కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం, హైదరాబాద్ జిల్లా నేతలతో ముఖ్యమంత్రి చర్చించారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై నాయకుల్లో ఏకాభిప్రాయం వ్యక్తమైందని కేసీఆర్ అన్నారు. 30 జిల్లాల ఏర్పాటుకు అనుగుణంగా కసరత్తు జరపాలని నిర్ణయించినట్లు చెప్పారు. కొత్తగూడెం కేంద్రంగా ఏర్పడే జిల్లాకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాగా పేరు, వికారాబాద్ కేంద్రంగా ఏర్పడే జిల్లాకు వికారబాద్ పేరు, మహబూబాబాద్ జిల్లా పేరును అలాగే కొనసాగించాలని సీఎం పేర్కొన్నారు.
సిరిసిల్ల కేంద్రంగా ఏర్పడే జిల్లాకు రాజన్న పేరు పెట్టాలనే ప్రతిపాదన ఉన్నట్లు చెప్పారు.
పెద్దపల్లి నగరపంచాయతీని మున్సిపాలిటీగా మార్చాలని, వరంగల్ గ్రామీణ జిల్లా కేంద్రాన్ని కూడా వరంగల్ నగరంలోనే ఏర్పాటు చేయాలని, స్టేషన్ఘన్పూర్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మూడు జిల్లాల ప్రతిపాదనలపై కసరత్తు చేయాలని.. కేశవరావు కమిటీ నివేదిక తెప్పించుకుని తుది నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ వెల్లడించారు.
2019 ఎన్నికల్లోనూ తెరాస గెలుస్తుందని ప్రతిపక్షాలు అంటున్నాయని.. కావున మన ప్రణాళిక రాబోయే ఏడెనిమిదేళ్ల కోసం జరగాలని కేసీఆర్ అన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







