సత్యనాదెళ్ల వేతన ప్యాకేజీ గతంతో పోల్చుకుంటే 3.3శాతం తగ్గిoది

- October 04, 2016 , by Maagulf
సత్యనాదెళ్ల వేతన ప్యాకేజీ గతంతో పోల్చుకుంటే 3.3శాతం తగ్గిoది

మైక్రోసాఫ్ట్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటీవ్‌ ఆఫీసర్‌ సత్యనాదెళ్ల వేతన ప్యాకేజీ గతంతో పోల్చుకుంటే 3.3శాతం తగ్గి 17.7మిలియన్‌ డాలర్లకు చేరింది. ఆయనకు చెల్లించిన ప్యాకేజీలో 5.66 మిలియన్‌ డాలర్ల వేతనం, బోనస్‌, 12 మిలియన్‌ డాలర్ల వాటాలు ఉన్నాయి. అక్కడి రెగ్యులేటరీలకు సంస్థ ఇచ్చిన ఫైలింగ్‌లో ఈ విషయాలను పేర్కొంది. ఈ వాటాల్లో సగం 2018 నాటికి సత్యనాదెళ్లకు అందుతాయి. కంపెనీ లక్ష్యాలను పూర్తి స్థాయిలో చేరితే 2019లో మిగిలిన వాటాలు కూడా ఆయనకు అందుతాయి. మైక్రోసాఫ్ట్‌ ప్రతినిధి పీటీ వూటన్‌ ఈ ప్యాకేజీపై మాట్లాడేందుకు నిరాకరరించారు. ఈ 12నెలల కాలంలో మైక్రోసాఫ్ట్‌ షేర్లు 15శాతం పెరిగాయి.అదే సమయంలో ఎస్‌అండ్‌పీ500 మాత్రం ఒక శాతం మాత్రమే పెరిగింది.సత్యనాదెళ్లను సీఈవోగా నియమించుకునేటప్పుడు మైక్రోసాఫ్ట్‌ ఆయనకు 59 మిలియన్‌ డాలర్ల విలువైన వాటాలు ఇచ్చేందుకు అంగీకరించింది. అదే సమయంలో వీటిని మూడు విడతలుగా ఇవ్వనున్నారు. 2019, 2020, 2021లో చెల్లించనున్నారు.
ఇవి ఇవ్వాలంటే ఎస్‌అండ్‌పీ 500లోని దాదాపు 60శాతం కంపెనీల వాటాదారుల ఆదాయాం కంటే మైక్రోసాఫ్ట్‌ వాటాదారుల ఆదాయం ఐదేళ్లపాటు ఎక్కువగా ఉండాలి. సత్యనాదెళ్ల పదవి చేపట్టినప్పటి నుంచి కంపెనీ ఆదాయం దాదాపు 70శాతం పెరిగినట్లు సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com