సత్యనాదెళ్ల వేతన ప్యాకేజీ గతంతో పోల్చుకుంటే 3.3శాతం తగ్గిoది
- October 04, 2016
మైక్రోసాఫ్ట్ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ సత్యనాదెళ్ల వేతన ప్యాకేజీ గతంతో పోల్చుకుంటే 3.3శాతం తగ్గి 17.7మిలియన్ డాలర్లకు చేరింది. ఆయనకు చెల్లించిన ప్యాకేజీలో 5.66 మిలియన్ డాలర్ల వేతనం, బోనస్, 12 మిలియన్ డాలర్ల వాటాలు ఉన్నాయి. అక్కడి రెగ్యులేటరీలకు సంస్థ ఇచ్చిన ఫైలింగ్లో ఈ విషయాలను పేర్కొంది. ఈ వాటాల్లో సగం 2018 నాటికి సత్యనాదెళ్లకు అందుతాయి. కంపెనీ లక్ష్యాలను పూర్తి స్థాయిలో చేరితే 2019లో మిగిలిన వాటాలు కూడా ఆయనకు అందుతాయి. మైక్రోసాఫ్ట్ ప్రతినిధి పీటీ వూటన్ ఈ ప్యాకేజీపై మాట్లాడేందుకు నిరాకరరించారు. ఈ 12నెలల కాలంలో మైక్రోసాఫ్ట్ షేర్లు 15శాతం పెరిగాయి.అదే సమయంలో ఎస్అండ్పీ500 మాత్రం ఒక శాతం మాత్రమే పెరిగింది.సత్యనాదెళ్లను సీఈవోగా నియమించుకునేటప్పుడు మైక్రోసాఫ్ట్ ఆయనకు 59 మిలియన్ డాలర్ల విలువైన వాటాలు ఇచ్చేందుకు అంగీకరించింది. అదే సమయంలో వీటిని మూడు విడతలుగా ఇవ్వనున్నారు. 2019, 2020, 2021లో చెల్లించనున్నారు.
ఇవి ఇవ్వాలంటే ఎస్అండ్పీ 500లోని దాదాపు 60శాతం కంపెనీల వాటాదారుల ఆదాయాం కంటే మైక్రోసాఫ్ట్ వాటాదారుల ఆదాయం ఐదేళ్లపాటు ఎక్కువగా ఉండాలి. సత్యనాదెళ్ల పదవి చేపట్టినప్పటి నుంచి కంపెనీ ఆదాయం దాదాపు 70శాతం పెరిగినట్లు సమాచారం.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







