ఒమాన్ లో విధుల్లో చేరిన నూతన భారత దేశ రాయబారి

- August 15, 2015 , by Maagulf
ఒమాన్ లో  విధుల్లో చేరిన నూతన భారత దేశ రాయబారి

భారత ప్రభుత్వం వారిచే సుల్తానెట్ ఆఫ్ ఒమాన్ యొక్క నూతన రాయబారిగా నియమింపబడిన ఇంద్రమణి పాండే , ఒమాన్ యొక్క విదేశాంగ శాఖ యొక్క పరిపాలన మరియు ఆర్ధిక వ్యవహారాల సెక్రటరీ శ్రీ మొహమ్మద్ బిన్ యూసుఫ్ అల్ జఫారీ వారికి సంబంధిత పత్రాలను సమర్పించి విధుల్లో చేరారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో అల్ జఫారీ మాట్లాడుతూ శ్రీ పాండే, తన ఉద్యోగ కాలంలో ఉభయ దేశాల సంబంధాలను, ప్రయోజనాలను కాపాడడంలో, ద్వైపాక్షిక సంబంధాలలో పురోగతి సాధించడంలో కృతకృత్యులౌతారనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. విదేశాంగ శాఖ అధికారులు కూడా ఇందులో పాల్గొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com