ఈ ఏడాది 161సైబర్ బ్లాక్ మెయిల్ కేసులు నివేదిక
- October 06, 2016
మస్కట్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అథారిటీ (ఐటీఏ) ఎలక్ట్రానిక్ బ్లాక్మెయిల్ ప్రమాదాలపై ఒక అవగాహన ప్రచారం ప్రారంభించింది.
టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ , పబ్లిక్ ప్రాసిక్యూషన్, రాయల్ ఒమాన్ పోలీస్ మరియు టెలికమ్యూనికేషన్ ప్రొవైడర్ల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు, ఈ ప్రచారంకు " వెలుపలికి మాట్లాడు మరియు మీ రహస్యం సురక్షితం' పేరుతో పిలువనున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అథారిటీ (ఐటీఏ) ప్రకారం, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ కోసం నేషనల్ సెంటర్ (NCIS) 2011 నుండి సైబర్ బ్లాక్మెయిల్ కేసులు 161 ఉండగా, ఈ ఒక్క ఏడాదిలో ఇప్పటివరకు 269 కేసులు నమోదు కాబడ్డాయి. కేసులలో 90 శాతం మంది పురుషులె బ్లాక్ మెయిల్ చర్యలలో పాల్గొటున్నారు. అయితే, వాటికన్నా మహిళలు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారని...వారి కేసులే అధికంగా ఉండవచ్చని కానీ వారు పిర్యాదులు చేయడానికి రారని...వారు భయపడుతున్న నేపథ్యంలో పిర్యాదులు ఎవరికీ చేయరని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అథారిటీ (ఐటీఏ) విశ్వసిస్తుందని తెలిపారు. ఎలక్ట్రానిక్ బ్లాక్మెయిల్ ప్రమాదాలపై అవగాహన పెంచడం మరియు ఆందోళన సంస్థలకు తెలియజేయడానికి బ్లాక్మెయిల్ బాధితులకు బాసటగానిలబడటం ఆ చట్టపరమైన అంశాలను అవగాహన వ్యాప్తి లక్ష్యంగా చేసుకుంటుంది.
సైబర్ బ్లాక్మెయిల్ కేసులను నేరుగా ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ హాట్లైన్ను 24166828 కోసం ఐటీఏ యొక్క నేషనల్ సెంటర్ ద్వారా లేదా [email protected] ఇ-మెయిల్ ద్వారా తెలపాలి. హాట్లైన్ వారంలో 24 గంటలు తెరిచి ఉంటుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







