ఈ ఏడాది 161సైబర్ బ్లాక్ మెయిల్ కేసులు నివేదిక
- October 06, 2016
మస్కట్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అథారిటీ (ఐటీఏ) ఎలక్ట్రానిక్ బ్లాక్మెయిల్ ప్రమాదాలపై ఒక అవగాహన ప్రచారం ప్రారంభించింది.
టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ , పబ్లిక్ ప్రాసిక్యూషన్, రాయల్ ఒమాన్ పోలీస్ మరియు టెలికమ్యూనికేషన్ ప్రొవైడర్ల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు, ఈ ప్రచారంకు " వెలుపలికి మాట్లాడు మరియు మీ రహస్యం సురక్షితం' పేరుతో పిలువనున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అథారిటీ (ఐటీఏ) ప్రకారం, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ కోసం నేషనల్ సెంటర్ (NCIS) 2011 నుండి సైబర్ బ్లాక్మెయిల్ కేసులు 161 ఉండగా, ఈ ఒక్క ఏడాదిలో ఇప్పటివరకు 269 కేసులు నమోదు కాబడ్డాయి. కేసులలో 90 శాతం మంది పురుషులె బ్లాక్ మెయిల్ చర్యలలో పాల్గొటున్నారు. అయితే, వాటికన్నా మహిళలు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారని...వారి కేసులే అధికంగా ఉండవచ్చని కానీ వారు పిర్యాదులు చేయడానికి రారని...వారు భయపడుతున్న నేపథ్యంలో పిర్యాదులు ఎవరికీ చేయరని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అథారిటీ (ఐటీఏ) విశ్వసిస్తుందని తెలిపారు. ఎలక్ట్రానిక్ బ్లాక్మెయిల్ ప్రమాదాలపై అవగాహన పెంచడం మరియు ఆందోళన సంస్థలకు తెలియజేయడానికి బ్లాక్మెయిల్ బాధితులకు బాసటగానిలబడటం ఆ చట్టపరమైన అంశాలను అవగాహన వ్యాప్తి లక్ష్యంగా చేసుకుంటుంది.
సైబర్ బ్లాక్మెయిల్ కేసులను నేరుగా ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ హాట్లైన్ను 24166828 కోసం ఐటీఏ యొక్క నేషనల్ సెంటర్ ద్వారా లేదా [email protected] ఇ-మెయిల్ ద్వారా తెలపాలి. హాట్లైన్ వారంలో 24 గంటలు తెరిచి ఉంటుంది.
తాజా వార్తలు
- భారత జట్టు తదుపరి మ్యాచ్ల షెడ్యూల్ ఇదే..!
- బెంగళూరులో రేపటి నుంచి హోటళ్లు బంద్
- ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా దుబాయ్–వరుసగా ఆరవ సంవత్సరం గుర్తింపు
- తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..
- అమరవీరులకు కువైట్ కన్నీటి నివాళి: సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
- లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం
- యూఏఈలో హెలికాప్టర్ ప్రమాదం: ఇద్దరు సాయుధ దళాల సిబ్బంది మృతి
- గల్ఫ్ దేశాల్లో 12వ తరగతి పరీక్షలు వాయిదా–CBSE కీలక నిర్ణయం
- 23400 ఉల్లంఘనలు..1,200 వాహనాలు సీజ్..!!
- వీడియోలు, ఫోటోలు షేర్.. 313 మంది అరెస్టు..!!









