విస్తారా దసరా ఆఫర్
- October 06, 2016
దసరా పండగ సందర్భంగా ఇప్పటికే కొన్ని విమానయాన సంస్థలు ఆఫర్లు ప్రకటించేశాయి. ఇప్పుడు 'విస్తారా' కూడా ఆ జాబితాలో చేరింది. ఈ సంస్థ పండగ ఆఫర్ను రూ.999 నుంచే ప్రారంభించింది. ఈ ఆఫర్ అక్టోబర్ 7 అర్ధరాత్రి వరకు వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది. ఈ ఏడాది అక్టోబర్ 12 నుంచి 2017 మార్చి 28 వరకు చేసే ప్రయాణాలకై కొనుగోలు చేసిన టిక్కెట్లపై ఈ ఆఫర్ వర్తిస్తుందని సంస్థ తెలిపింది.
శ్రీనగర్-జమ్మూ మార్గంలో రూ.999 ఆఫర్ వర్తిస్తుందని విస్తారా తెలిపింది. దిల్లీ-ముంబయి మార్గంలో ఎకానమీ క్లాస్లో రూ.5,800 ఉండే టిక్కెట్లు ప్రస్తుత ఆఫర్ల దృష్ట్యా సంస్థ వెబ్సైట్లో రూ.2,300కే అందుబాటులో ఉన్నాయి.
ఎకానమీ క్లాస్కే కాకుండా ప్రీమియమ్ ఎకానమీ క్లాస్, బిజినెస్ క్లాస్లకు కూడా ఈ ఆఫర్లున్నాయని సంస్థ చీఫ్ స్ట్రాటెజీ అండ్ కమర్షియల్ అధికారి సంజీవ్ కపూర్ తెలిపారు.
ఇప్పటికే ఎయిర్ఏషియా ఇండియా, జెట్ఎయిర్వేస్, స్పైస్జెట్ సంస్థలు పండగ ఆఫర్లు ప్రకటించాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







