విస్తారా దసరా ఆఫర్‌

- October 06, 2016 , by Maagulf
విస్తారా దసరా ఆఫర్‌

దసరా పండగ సందర్భంగా ఇప్పటికే కొన్ని విమానయాన సంస్థలు ఆఫర్లు ప్రకటించేశాయి. ఇప్పుడు 'విస్తారా' కూడా ఆ జాబితాలో చేరింది. ఈ సంస్థ పండగ ఆఫర్‌ను రూ.999 నుంచే ప్రారంభించింది. ఈ ఆఫర్‌ అక్టోబర్‌ 7 అర్ధరాత్రి వరకు వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది. ఈ ఏడాది అక్టోబర్‌ 12 నుంచి 2017 మార్చి 28 వరకు చేసే ప్రయాణాలకై కొనుగోలు చేసిన టిక్కెట్లపై ఈ ఆఫర్‌ వర్తిస్తుందని సంస్థ తెలిపింది.

శ్రీనగర్‌-జమ్మూ మార్గంలో రూ.999 ఆఫర్‌ వర్తిస్తుందని విస్తారా తెలిపింది. దిల్లీ-ముంబయి మార్గంలో ఎకానమీ క్లాస్‌లో రూ.5,800 ఉండే టిక్కెట్లు ప్రస్తుత ఆఫర్ల దృష్ట్యా సంస్థ వెబ్‌సైట్‌లో రూ.2,300కే అందుబాటులో ఉన్నాయి.

ఎకానమీ క్లాస్‌కే కాకుండా ప్రీమియమ్‌ ఎకానమీ క్లాస్‌, బిజినెస్‌ క్లాస్‌లకు కూడా ఈ ఆఫర్లున్నాయని సంస్థ చీఫ్‌ స్ట్రాటెజీ అండ్‌ కమర్షియల్‌ అధికారి సంజీవ్‌ కపూర్‌ తెలిపారు.
ఇప్పటికే ఎయిర్‌ఏషియా ఇండియా, జెట్‌ఎయిర్‌వేస్‌, స్పైస్‌జెట్‌ సంస్థలు పండగ ఆఫర్లు ప్రకటించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com