కరీబియన్‌ దేశాల్లో 'మాథ్యూ' బీభత్సం

- October 06, 2016 , by Maagulf
కరీబియన్‌ దేశాల్లో  'మాథ్యూ' బీభత్సం

కరీబియన్‌ దేశాలైన హైతి, క్యూబా, బహామాస్‌లలో టైఫూన్‌ మాథ్యూ బీభత్సం సృష్టిస్తోంది. అకాల వర్షాల కారణంగా అక్కడ నివసించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెను గాలుల వల్ల వృక్షాలు నేలకొరిగి రహదారులకు అడ్డంగా పడిపోయి వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మాథ్యూ టైఫూన్‌ కారణంగా ఇప్పటి వరకు 17 మంది మృతి చెందగా, పలువురు గల్లంతయ్యారు. వాతావరణ పరిస్థితులు సక్రమంగా లేకపోవడంతో ఆదివారం జరగాల్సిన ప్రెసిడెన్షియల్‌ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు హైతి ఎన్నికల కౌన్సిల్‌ ప్రకటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com