సైనికుల కోసం బాలీవుడ్ మెగాస్టార్ పాట
- October 06, 2016
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ సైనికుల కోసం పాట పాడనున్నారు. ఇటీవల ఉరీలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో అమరులైన సైనికులకు ఈ పాటను అంకితం చేయనున్నారు. సైనికుల కోసం అమితాబ్ను పాట పాడమని కోరినట్లు బీజేపీ ఎంపీ తరుణ్ విజయ్ తన ఫేస్బుక్ ఖాతా ద్వారా తెలిపారు. 'అమితాబ్ బచ్చన్ను కలిశాను. మన నిజమైన జాతీయ హీరోను కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఆయన హనుమాన్ చాలీసా, కేదార్నాథ్ అర్చనతోపాటు సిద్ధి వినాయక్ హారతిని ఆలపించారు. సైనిక వీరుల కోసం కూడా తన స్వరం అందించమని కోరాము' అని తరుణ్ విజయ్ పోస్ట్ చేశారు. బిగ్ బి ఈ ఏడాది ప్రారంభంలో ఇండియా-పాకిస్థాన్ టీ-20 ప్రపంచ కప్ సమయంలో జాతీయగీతం పాడిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







