సైనికుల కోసం బాలీవుడ్ మెగాస్టార్ పాట
- October 06, 2016
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ సైనికుల కోసం పాట పాడనున్నారు. ఇటీవల ఉరీలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో అమరులైన సైనికులకు ఈ పాటను అంకితం చేయనున్నారు. సైనికుల కోసం అమితాబ్ను పాట పాడమని కోరినట్లు బీజేపీ ఎంపీ తరుణ్ విజయ్ తన ఫేస్బుక్ ఖాతా ద్వారా తెలిపారు. 'అమితాబ్ బచ్చన్ను కలిశాను. మన నిజమైన జాతీయ హీరోను కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఆయన హనుమాన్ చాలీసా, కేదార్నాథ్ అర్చనతోపాటు సిద్ధి వినాయక్ హారతిని ఆలపించారు. సైనిక వీరుల కోసం కూడా తన స్వరం అందించమని కోరాము' అని తరుణ్ విజయ్ పోస్ట్ చేశారు. బిగ్ బి ఈ ఏడాది ప్రారంభంలో ఇండియా-పాకిస్థాన్ టీ-20 ప్రపంచ కప్ సమయంలో జాతీయగీతం పాడిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- భారత జట్టు తదుపరి మ్యాచ్ల షెడ్యూల్ ఇదే..!
- బెంగళూరులో రేపటి నుంచి హోటళ్లు బంద్
- ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా దుబాయ్–వరుసగా ఆరవ సంవత్సరం గుర్తింపు
- తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..
- అమరవీరులకు కువైట్ కన్నీటి నివాళి: సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
- లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం
- యూఏఈలో హెలికాప్టర్ ప్రమాదం: ఇద్దరు సాయుధ దళాల సిబ్బంది మృతి
- గల్ఫ్ దేశాల్లో 12వ తరగతి పరీక్షలు వాయిదా–CBSE కీలక నిర్ణయం
- 23400 ఉల్లంఘనలు..1,200 వాహనాలు సీజ్..!!
- వీడియోలు, ఫోటోలు షేర్.. 313 మంది అరెస్టు..!!









