శ్రీనివాస్ చక్రవర్తి దర్శకత్వంలో కొత్త చిత్రం ఆరంభం
- October 06, 2016
'గోల్కొండ హైస్కూల్', 'తను నేను' ఫేం సంతోష్ శోభన్ హీరోగా దర్శకుడు కృష్ణవంశీ శిష్యుడు శ్రీనివాస్ చక్రవర్తి దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. బుధవారం ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. సింప్లిజిత్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ డైరెక్టర్ మాధవీలత క్లాప్ కొట్టగా, దర్శకుడు వంశీపైడి పల్లి కెమెరా స్విచ్చాన్ చేశారు. సింప్లిజిత్ ప్రొడక్షన్స్ పతాకంపై అభిజిత్ జయంతి నిర్మిస్తున్న ఈ చిత్రంలో నరేష్, తనికెళ్ల భరణి, అజయ్, వెన్నెల కిషోర్, జెమిని సురేష్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: డిజె వసంత్, కెమెరామెన్: సామల భాస్కర్, ఆర్ట్: కిరణ్కుమార్ మన్నె, పాటలు: రామజోగయ్య శాస్త్రి, భాస్కరభట్ల, బాలాజీ.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







