శ్రీనివాస్‌ చక్రవర్తి దర్శకత్వంలో కొత్త చిత్రం ఆరంభం

- October 06, 2016 , by Maagulf
శ్రీనివాస్‌ చక్రవర్తి దర్శకత్వంలో కొత్త చిత్రం ఆరంభం

 'గోల్కొండ హైస్కూల్‌', 'తను నేను' ఫేం సంతోష్‌ శోభన్‌ హీరోగా దర్శకుడు కృష్ణవంశీ శిష్యుడు శ్రీనివాస్‌ చక్రవర్తి దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. బుధవారం ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. సింప్లిజిత్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ డైరెక్టర్‌ మాధవీలత క్లాప్‌ కొట్టగా, దర్శకుడు వంశీపైడి పల్లి కెమెరా స్విచ్చాన్‌ చేశారు. సింప్లిజిత్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై అభిజిత్‌ జయంతి నిర్మిస్తున్న ఈ చిత్రంలో నరేష్‌, తనికెళ్ల భరణి, అజయ్‌, వెన్నెల కిషోర్‌, జెమిని సురేష్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: డిజె వసంత్‌, కెమెరామెన్‌: సామల భాస్కర్‌, ఆర్ట్‌: కిరణ్‌కుమార్‌ మన్నె, పాటలు: రామజోగయ్య శాస్త్రి, భాస్కరభట్ల, బాలాజీ.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com