అతి తక్కువ ప్రీమియంకే రైల్వే ట్రావెల్ ఇన్సూరెన్స్
- October 06, 2016
దీపావళి పండుగ సమీపిస్తున్న సందర్భంగా ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని రైల్వేశాఖ ఒక్కపైసా రుసుంతో ట్రావెల్ ఇన్సూరెన్స్ను ప్రవేశపెట్టింది. 92పైసలున్న ట్రావెల్ ఇన్సూరెన్స్ను శుక్రవారం నుంచి ఒక్కపైసాకు తగ్గిస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. సెప్టెంబర్ 1నుంచి రైల్వేశాఖ ప్రయాణికులకు ఇన్సూరెన్స్ సౌకర్యం ప్రవేశపెట్టింది. అక్టోబర్ 31 వరకూ మాత్రమే ఈ ఒక్కపైసా ఇన్సూరెన్స్ పథకం అమలులో ఉంటుంది. అత్యధిక సంఖ్యలో ప్రయాణికులకు చేరువయ్యేందుకు ఈ పథకం ఉపయోగపడనుందని ఐఆర్సీటీసీ ఛైర్మన్ ఏకే మనోచా పేర్కొన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం 2016-17 రైల్వే బడ్జెట్లో ప్రవేశపెట్టిన ఈ బీమాను అమలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









