అటామా సరిహద్దు క్రాసింగ్ వద్ద పేలుడు.....
- October 06, 2016
టర్కీ-సిరియా సరిహద్దు ప్రాంతంలో గురువారం సంభవించిన భారీ పేలుడులో కనీసం 40 మంది మరణించినట్లు అల్ మయాదీన్ టీవీ ఛానల్ వెల్లడించింది. అటామా సరిహద్దు క్రాసింగ్ వద్ద సిరియా తిరుగుబాటుదారులను లక్ష్యంగా చేసుకుని ఈ పేలుడు జరిగిందని ఈ టీవీ ఛానల్ తన వార్తా కథనంలో వివరించింది. ఈ పేలుడుకు తామే బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించిన ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) మిలిటెంట్ గ్రూప్ తమ ఆత్మాహుతి దళ సభ్యుడొకరు పేలుడు పదార్ధాలతో నిండిన కారుతో సరిహద్దు ప్రాంతం వద్ద దాడి చేసినట్లు వెల్లడించింది. ఈ సరిహద్దు ప్రాంతం సిరియా ఉత్తరాన వున్న ఇడ్లిబ్ ప్రావిన్స్లో వుంది. తొలుత ఈ దాడిలో 20 మంది రెబల్స్ ప్రాణాలు కోల్పోయినట్లు లండన్కు చెందిన సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









