మైసూరు ప్యాలెస్‌లో దసరా సంబరాలు అంగరంగ వైభవంగా ..

- October 06, 2016 , by Maagulf
మైసూరు ప్యాలెస్‌లో దసరా సంబరాలు అంగరంగ వైభవంగా ..

మైసూరు ప్యాలెస్‌లో దసరా సంబరాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. పండుగ సందర్భంగా ప్యాలెస్‌ ఆవరణ మొత్తాన్ని రంగు రంగుల విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. మహారాజు యదువీర్‌ కృష్ణదత్త చామరాజ ఒడెయరు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ దసరా సంబరాలు మిన్నంటాయి. భార్య త్రిషికా సింగ్‌ యదువీర్‌తో కలిసి తొలిసారిగా ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఆహుతులను అలరించేందుకు పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఏటా మైసూరు ప్యాలెస్‌లో దసరా సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. మహారాజుల దర్పం ఉట్టిపడే విధంగా సంబరాలు ఉంటాయి. నవరాత్రి ఉత్సవాల్లో రోజూ ప్రైవేట్‌ దర్బార్‌ కొనసాగుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com