జోయాలుక్కాస్ క్యాన్సర్ అవేర్నెస్ క్యాంపెయిన్
- October 06, 2016
మనామా: జోయాలుక్కాస్ గ్రూప్ 'థింక్ పింక్ 2016', 'మామ్ ఐ నీడ్ యు' అనే క్యాంపెయిన్ని ప్రారంభించింది. మహిళలకు, ముఖ్యంగా తల్లులకు మోటివేషన్ కోసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 'మామ్ ఐ నీడ్ యు' క్యాంపెయిన్ ద్వారా పిల్లల్లో అవగాహన పెంచడం, తమ తల్లులు రెగ్యులర్గా హెల్త్ చెకప్ చేయించుకునేలా ప్రోత్సహించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం. నెల రోజులపాటు మల్టీ మీడియా క్యాంపెయిన్ జరగనుంది. జోయాలుక్కాస్ గ్రూప్ డైరెక్టర్ సోనియా అలుక్కాస్ మాట్లాడుతూ, 11 దేశాల్లో తమ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోందని తెలిపారు. 10 మిలియన్ వినియోగదారులు తమకు ఉన్నారని చెప్పారామె. దుబాయ్ హెల్త్ అథారిటీ మద్దతుతో థింక్ పింక్ క్యాంపెయిన్ అక్టోబర్ 2011లో ప్రారంభమయ్యింది. ఇప్పటిదాకా 40,000 మంది ఈ కార్యక్రమంలో పాల్గొని, బ్రెస్ట్ స్క్రీనింగ్ సౌకర్యాల్ని పొందారు. చిన్నారులు, తమ తల్లుల ఆరోగ్యం మీద శ్రద్ధతో, బ్రెస్ట్ స్క్రీనింగ్ కోసం సోషల్ మీడియా ద్వారా మంచి మంచి మెసేజ్లను పంపించవచ్చనీ, అలాంటివాటిల్లో మంచి మెసేజ్ని ఎంపిక చేసి 2,500 అరబ్ ఎమిరేట్స్ దినార్స్ విలువైన డైమండ్ని బహుమతిగా ఇస్తామని జోయాలుక్కాస్ గ్రూప్ ప్రకటించింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







