అమ్మ క్షేమంగా తిరిగి రావాలంటూ కోరుకుంటూ పూజలు

- October 07, 2016 , by Maagulf
అమ్మ క్షేమంగా తిరిగి రావాలంటూ కోరుకుంటూ పూజలు

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు సింగపూర్‌ వైద్యులు చికిత్స నిర్వహిస్తున్నారు. గత నెల 22వతేదీన అనారోగ్యంతో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. కాగా... ఇప్పటికే ఆమెకు లండన్ నుంచి వచ్చిన ఇద్దరు వైద్యులు ఆమెకు వైద్య చికిత్సలు నిర్వహించారు. అలాగే ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు కూడా చికిత్స నిర్వహించారు. కాగా... శుక్రవారం సింగపూర్ నుంచి వచ్చిన వైద్యులు ఆమెకు చికిత్స నిర్వహిస్తున్నారు. అలాగే జయలలితను సింగపూర్ తరలించే అవకాశముందనే ఊహాగానాలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం అపోలో ఆస్పత్రి దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. తమిళనాడు ప్రజలు 'అమ్మ'గా పిలుచుకునే జయలలిత...త్వరగా కోలుకోవాలని కోరుతూ ఆమె అభిమానులు, పార్టీ కార్యకర్తలు పూజలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా... ఇప్పటికే జయలలిత అనారోగ్యంపై తీవ్ర ఆందోళనతో ఉన్న ఆపార్టీ కార్యకర్తలు ఆమెను సింగపూర్ కు తరలిస్తారని వెలువడ్డ వార్తలతో మరింతో ఆందోళన చెందుతున్నారు. అమ్మ క్షేమంగా తిరిగి రావాలంటూ కోరుకుంటూ పూజలు నిర్వహిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com