విశాఖ విమానాశ్రయం కొత్త రికార్డు నమోదు

- October 07, 2016 , by Maagulf
విశాఖ విమానాశ్రయం కొత్త రికార్డు నమోదు

విశాఖపట్నం విమానాశ్రయం కొత్త రికార్డును నమోదు చేసింది. ఆగస్టులో విశాఖ విమానాశ్రయం నుంచి రికార్డు స్థాయిలో 2,05,445 మంది ప్రయాణం చేశారు. ఇందులో అంతర్జాతీయ ప్రయాణికులు 7,897 మంది కాగా, డొమెస్టిక్‌ ప్రయాణికులు 1,97,548 మంది. విమానాశ్రయ చరిత్రలో ఇప్పటి వరకూ ఒక నెలలో రెండు లక్షల మంది ప్రయాణించిన దాఖలాలు లేవు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు వరకు విశాఖ నుంచి మొత్తం 9,42,794 మంది ప్రయాణం చేశారు. ఇదే కాలానికి గత ఏడాది 6,77,779 మంది ప్రయాణించారు. ఆగస్టులో విజయవాడ విమానాశ్రయం నుంచి 56,312 మంది, తిరుపతి విమానాశ్రయం నుంచి 45,646 మంది, రాజమండ్రి విమానాశ్రయం నుంచి 21,245 మంది ప్రయాణించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com