అక్టోబర్ చివరిలో మొదలుకానున్న టీఎస్ఆర్టీసీ మినీబస్సు సర్వీసులు
- October 08, 2016
ఫ్రాన్స్ ప్రభుత్వ సహకారంతో ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రాన్స్పోర్ట్ విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలంగాణ ఆర్టీసీ ఎండీ రమణరావు తెలిపారు. ఈ మేరకు ఫ్రాన్స్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు. జర్మనీలో జరిగిన అంతర్జాతీయ బస్ కంపెనీల ప్రదర్శనలో పాల్గొన్న ఆయన ఆ వివరాలను వెల్లడించారు. ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రాన్స్పోర్టు విధానంలో, బస్ ఎక్కడ ఉందో జీపీఎస్ ద్వారా తెలుసుకోవడంతో పాటు సౌర విద్యుత్ ఆధారంగా ఎలక్ట్రానిక్ బోర్డులను ఏర్పాటు చేస్తామన్నారు. ఎలక్ట్రానిక్ బోర్డులను బస్స్టేషన్లలో ప్రయాణికులకు అందుబాటులో ఉంచడం వల్ల ఏ బస్, ఎప్పుడు వస్తుందో సులువుగా తెలుస్తుందన్నారు. 9 నెలల పాటు ఫ్రాన్స్ ప్రభుత్వం దీన్ని ప్రయోగాత్మకంగా కోఠి-ఉప్పల్ రహదారిలో అమలు చేస్తుందని చెప్పారు. కేంద్రం సహకరిస్తే బ్యాటరీ ద్వారా నడిచే ఎలక్ట్రికల్ బస్సులను నడుపుతామన్నారు. ఫ్రాన్స్, జర్మనీ దేశాల్లో ఈ బస్సులను నడుపుతున్నట్లు చెప్పారు. ఆర్టీసీలో ఇప్పటివరకు ఉన్న ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వ్యవస్థను రద్దు చేసినట్లు చెప్పారు.
ఈ నెలాఖరులోగా మినీ బస్సులను తిప్పుతామని, మరో ఐదారు నెలల్లో ఆర్టీసీ ఆధ్వర్యంలోని పెట్రోల్ బంకుల నిర్వహణ ప్రారంభమవుతుందని చెప్పారు. బయో డీజిల్తో నడిచే రెండు బస్సులను ఈ నెలాఖరు నుంచి నడపనున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







