దుబాయ్లో అగ్ని ప్రమాదం: 250 మంది తరలింపు
- October 10, 2016
దుబాయ్: సిలికాన్ ఒయాసిస్లోని రెసిడెన్షియల్ టవర్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం అక్కడివారిని తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. ఇద్దరు మహిళలు ఈ ఘటనలో గాయపడ్డారు. మొత్తం 250 మంది నివాసితుల్ని అక్కడినుంచి ఖాళీ చేయించారు అధికారులు. పొగ పీల్చడం ద్వారా 35 మందికి సమస్యలు తలెత్తగా, ఓ గర్భిణీ మహిళ తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఆమెను ఆసుపత్రికి తరలించారు. మరో మహిళ కాలికి గాయమయ్యింది. సాయంత్రం 5.43 నిమిషాల సమయంలో ప్రమాదం చోటుచేసుకోగా, వెంటనే సంబంధిత అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని, సహాయ చర్యల్ని ముమ్మరం చేశారు. ప్రమాదంలో ఎవరికీ తీవ్రగాయాలు కాకపోవడం పట్ల అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా తక్షణం స్పందించిన దుబాయ్ సివిల్ డిఫెన్స్ని అందరూ అభినందించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







