పాంపోర్ ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
- October 12, 2016
పాంపోర్లో మూడు రోజులుగా ఉగ్రవాదులతో జరుగుతున్న ఎన్కౌంటర్ ముగిసింది. భద్రతా దళాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. సోమవారం ఉదయం శ్రీనగర్-జమ్ము జాతీయ రహదారిపై ఉన్న ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ఇనిస్టిట్యూట్(ఈడీఐ) భవనంలోకి చొరబడిన ఉగ్రవాదులు మూడు రోజులుగా భద్రతా దళాలపైకి కాల్పులు జరుపుతున్న విషయం విదితమే. చివరికి బుధవారం మూడో రోజు భద్రతా దళాలు ముష్కరులను మట్టుబెట్టాయి. కాగా బిల్డింగ్లో మరో ఉగ్రవాది దాక్కుని ఉండొచ్చని భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి. ఆపరేషన్ ఇంకా కొనసాగుతునే ఉందని అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా ఉగ్రవాదులు ఈ బిల్డింగ్లోకి చొరబడి భద్రతాధికారులపై కాల్పులు జరిపారు.ఈ ఘటనలో ఐదుగురు అధికారులు, ఇనిస్టిట్యూట్ ఉద్యోగి, ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారు. అప్పట్లో జరిగిన ఆపరేషన్ 48 గంటల్లో ముగియగా తాజా ఆపరేషన్ 52 గంటల్లో ముగిసింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







