సిరియా: వైమానిక దాడుల లో 16 మంది మృతి
- October 12, 2016
వైమానిక దాడులతో ఆ ప్రాంతం శిథిలాల గుట్టగా మారింది. శిథిలాల కింద ఎవరో ఉన్నారన్న అనుమానం వచ్చింది. బాలుడి మూలుగు వినిపించింది. సహాయ సిబ్బంది అతనిని సజీవంగా బయటకు తీయగలిగారు. ఈ ఘటన సిరియాలో జరిగింది. నిత్యం బాంబుల మోతలతో దద్దరిల్లే అలెప్పో నగరమది. ఆ రోజు కూడా వైమానిక దాడులు జరిగాయి. అవాస ప్రాంతాల్లోని కొన్ని భవనాలు నేలకొరిగాయి. వాటి కింద సజీవంగా ఉన్నవారి కోసం సిరియా రిస్క్యూ సిబ్బంది వెదకడం మొదలెట్టింది. ఒక చోట మూలుగు వినిపించింది. అక్కడ ఒక బాలుడు సజీవంగా కనిపించాడు. అతనిని బయటకు తీసి వెంటనే ఆస్పత్రికి తరలించారు. సిరియాలో తరచూ ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఆస్పత్రికి తరలించాగానే వారు చనిపోతున్నారు.ఈసారి మాత్రం బాలుడు ఆరోగ్యంగా ఉన్నాడని వైద్యులు తెలిపారు. తాజాగా జరిగిన దాడుల్లో 16 మంది మృతిచెందారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







