లిమోస్ వాహనాలలో దుబాయ్ టాక్సీ ఉచిత " వైఫై " సౌకర్యం
- October 12, 2016
దుబాయ్ : దుబాయ్ టాక్సీ సంస్థ (డీటీసీ), రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్.టి.ఎ) వినియోగదారులు సంతృప్తి చెంది మరియు వారిని సంతోషపర్చే లక్ష్యంతో ఉచిత వైఫై సేవలను వాహనాలలో ప్రవేశపెట్టింది.. తొలుత ప్రయోగాత్మకంగా అన్ని లిమోస్ కార్లలో ఏర్పాటు చేసి క్రమంగా ఈ సేవలను డిటిసి అద్దె కారులకు విస్తరించనున్నారు. దుబాయ్ టాక్సీ కార్పొరేషన్ సీఈఓ డాక్టర్ యూసఫ్ మహమ్మద్ అల్ ఆలీ మాట్లాడుతూ , డిటిసి యొక్క లిమోసైన్స్ వాహనాలలో గొప్ప మరియు ఏకైక సేవని ప్రయోగాత్మకంగా కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. హోటళ్లు, విమానయాన సంస్థలు మరియు ఇతర పబ్లిక్ సంబంధిత లేదా పర్యాటక రంగంలో ఉన్న మా ఖాతాదారుల అవసరాలకు తగిన విధంగా అందించేలా ధీటుగా ఉంటాయని అన్నారు. ప్రైవేటు సంస్థలకు తమ సేవ దుబాయ్ నుండి అన్ని ఇతర ఎమిరేట్స్ ప్రాంతాలకు వారంలో 24 గంటలు అందుబాటులో ఉంటుందన్నారు. దుబాయ్ టాక్సీ కార్పొరేషన్ లిమోస్ వైఫై సేవలని అందించడంలో నిపుణులైన ప్రొవైడర్ తో ఒక ఒప్పంద సంతకం చేసింది. ఖాతాదారులకు రవాణా సమయంలో ఉచిత వైఫై పొందగోరేవారు విధిగా మా 113 లిమౌసిన్స్ను వాహనాలలో ప్రయాణించి ఆ సేవను పొంది నూతన అవధులు ధాటి మరియు అధిక నాణ్యత సేవలు పొందవచ్చని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







