క్యాన్సర్‌పై అవగాహన: పింక్‌ కలర్‌లో బుర్జ్‌ ఖలీఫా

- October 12, 2016 , by Maagulf
క్యాన్సర్‌పై అవగాహన: పింక్‌ కలర్‌లో బుర్జ్‌ ఖలీఫా

దుబాయ్‌: దుబాయ్‌కి చెందిన బుర్జ్‌ ఖలీఫా, ఈ వారంలో పింక్‌ కలర్‌లో వెలుగులు విరజిమ్మనుంది. ప్రపంచంలోనే అతి పెద్ద టవర్‌ అయిన బుర్జ్‌ ఖలీఫాని, పింక్‌ కలర్‌లోకి మార్చడం వెనుక మంచి ఉద్దేశ్యమే ఉంది. క్యాన్సర్‌ పట్ల అవగాహన కల్పించడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గురువారం సాయంత్రం పింక్‌ కలర్‌ లైట్స్‌ని స్విచాన్‌ చేస్తారు. వార్షిక బ్రెస్ట్‌ క్యాన్సర్‌ అవగాహనా మాసం సందర్భంగా అక్టోబర్‌లో ఇలాంటి కార్యక్రమాలు చేపడ్తుంటారు. ఈ విషయాన్ని బఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ సంస్థ వెల్లడించింది. ఈ సందర్భంగా బుర్జ్‌ ఖలీఫాని సందర్శించేవారు పింక్‌ కలర్‌ దుస్తుల్లో రావాల్సిందిగా నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. అక్టోబర్‌లో ప్రతి అమ్మకంపైనా ఒక ఎమిరేటీ దిర్హామ్‌ని అల్‌ జలిలా ఫౌండేషన్‌కి అందజేస్తామని బుర్జ్‌ ఖలీఫా నిర్వాహకులు వెల్లడించారు. దుబాయ్‌ రూలర్‌ షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తౌమ్‌, బ్రెస్ట్‌ క్యాన్సర్‌ని తొలి దశలో గుర్తించేందుకు వీలుగా అవగాహనా కార్యక్రమాలు చేపట్టడానికి ఈ ఫౌండేషన్‌ని ప్రారంభించారు. ప్రపంచ వ్యాప్తంగా మహిళల్లో ఎక్కువగా వస్తున్న క్యాన్సర్లలో బ్రెస్ట్‌ క్యాన్సర్‌ అతి ముఖ్యమైనది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com