జాతి నిర్మాణంలో మహిళ పాత్రపై సెమినార్
- October 13, 2016
మస్కట్: ఒమనీ వర్క్ ఫోర్స్లో ఎక్కువమంది మహిళలకు అవకాశం కల్పించే దిశగా ఏడవ ఒమనీ విమెన్స్ డే సందర్భంగా మినిస్ట్రీ ఆఫ్ సోసల్ డెవలప్మెంట్ నిర్వహించిన సెమినార్లో చర్చ జరిగింది. 100 మందికి పైగా మహిళా ఎంటర్ప్రెన్యూర్స్, స్టూడెంట్స్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 'విమెన్ లీడర్షిప్ సెమినార్' పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ డెవలప్మెంట్ అండర్ సెక్రెటరీ డాక్టర్ యాహ్యా బిన్ బాదర్ బిన్ మాలిక్ అల్ మావలి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రపంచ ప్రఖ్యాత విమెన్ లీడర్ షిప్ ట్రైనర్ మరియు కోచ్ డాక్టర్ బెర్నిస్ లెడ్బెట్టర్ (సెంటర్ ఫర్ విమెన్ ఇన్ లీడర్షిప్, పెప్పర్డైన్ యూనివర్సిటీ, అమెరికా డైరెక్టర్) ఈ ఈవెంట్లో ట్రైనింగ్ సెషన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఒమన్టెల్ సిఇఓ తలాల్ బిన్ సైద్ మర్హూన్ మాట్లాడుతూ, మహిళలు పురుషులతో ఏ విషయంలోనూ తీసిపోలేరనీ, టాలెంట్ విషయంలో ఇద్దరూ ఒకటేనని అన్నారు. గత కొన్నాళ్ళుగా ఫిమేల్ స్టాఫ్ పెరుగుతూ వస్తున్నారని తలాల్ బిన్ వివరించారు.
తాజా వార్తలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు









