జాతి నిర్మాణంలో మహిళ పాత్రపై సెమినార్
- October 13, 2016
మస్కట్: ఒమనీ వర్క్ ఫోర్స్లో ఎక్కువమంది మహిళలకు అవకాశం కల్పించే దిశగా ఏడవ ఒమనీ విమెన్స్ డే సందర్భంగా మినిస్ట్రీ ఆఫ్ సోసల్ డెవలప్మెంట్ నిర్వహించిన సెమినార్లో చర్చ జరిగింది. 100 మందికి పైగా మహిళా ఎంటర్ప్రెన్యూర్స్, స్టూడెంట్స్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 'విమెన్ లీడర్షిప్ సెమినార్' పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ డెవలప్మెంట్ అండర్ సెక్రెటరీ డాక్టర్ యాహ్యా బిన్ బాదర్ బిన్ మాలిక్ అల్ మావలి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రపంచ ప్రఖ్యాత విమెన్ లీడర్ షిప్ ట్రైనర్ మరియు కోచ్ డాక్టర్ బెర్నిస్ లెడ్బెట్టర్ (సెంటర్ ఫర్ విమెన్ ఇన్ లీడర్షిప్, పెప్పర్డైన్ యూనివర్సిటీ, అమెరికా డైరెక్టర్) ఈ ఈవెంట్లో ట్రైనింగ్ సెషన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఒమన్టెల్ సిఇఓ తలాల్ బిన్ సైద్ మర్హూన్ మాట్లాడుతూ, మహిళలు పురుషులతో ఏ విషయంలోనూ తీసిపోలేరనీ, టాలెంట్ విషయంలో ఇద్దరూ ఒకటేనని అన్నారు. గత కొన్నాళ్ళుగా ఫిమేల్ స్టాఫ్ పెరుగుతూ వస్తున్నారని తలాల్ బిన్ వివరించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







