దుబాయ్ లో దాండియా ఆటల నిర్వహణ
- October 13, 2016
గత 51 సంవత్సరాల నుండి దుబాయ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రాజస్థాన్ దాండియా సాంప్రదాయక సాంస్కృతిక నృత్య కార్యక్రమం సాంప్రదాయంగా కొనసాగతోంది. పట్టణ కార్యక్రమ నిర్వహణలో ఉత్తమ సంస్థగా పేరొందిన పరాజయ సోని ఈవెంట్స్ మేనేజ్మెంట్ ఎల్ ఎల్ సి ఘనంగా నిర్వహించనుంది. యువతీ యువకులు ఎంతో ఉత్సాహంగా పాల్గొనే ఈ కార్యక్రమం నిర్వాహకులుగా దిలీప్ సోని వైస్ ప్రెసిడెంట్ మరియు యు ఏ ఇ లో పరాజయ సోని కమ్యూనిటీ అధ్యక్షుడు హస్ముఖ్ దానక్ ఈ కార్యక్రమంను యుఎఇ లో ప్రజా సంబంధాల అధికారిగా ఓవిలియా ఫెర్నాండెజ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రెండు నుంచి 3 వేల మంది పని రోజులలో దాండియా ఆటలలో పాల్గొంటారని సెలవు రోజులలో, ఈ సంఖ్య దాదాపు 7 వేల నుంచి 8 వేల వరకు సగటు సమూహాలు ఆనంద ఉత్సాహాలతో దాండియా కొనసాగించనున్నారు.రోజూవారీగా 50 నుంచి 60 వరకు పలు బహుమతులను వివిధ విభాగాలలో ఇవ్వనున్నట్లు నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఉత్తమ నాట్యం,మంచి దుస్తులను ధరించినవారు ,ఉత్తమ జంట తదితర అన్ని వయసుల వారికి అదే రోజున అందిస్తామని వారు తెలిపారు. 9 రోజుల కాలవ్యవధిలో జరిగే దాండియా కార్యక్రమంకు 211 మంది వరకు పాల్గొననున్నారు. ఈ పోటీలో14 మంది విజేతలని ఎంపిక చేయనున్నారు. అలాగే పాల్గొనేవారందరికి ఏకీకరణ ( కన్సోలేషన్ ) బహుమతులను నిర్వాకులు అందచేయనున్నారు.








తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







