దుబాయ్ లో దాండియా ఆటల నిర్వహణ
- October 13, 2016
గత 51 సంవత్సరాల నుండి దుబాయ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రాజస్థాన్ దాండియా సాంప్రదాయక సాంస్కృతిక నృత్య కార్యక్రమం సాంప్రదాయంగా కొనసాగతోంది. పట్టణ కార్యక్రమ నిర్వహణలో ఉత్తమ సంస్థగా పేరొందిన పరాజయ సోని ఈవెంట్స్ మేనేజ్మెంట్ ఎల్ ఎల్ సి ఘనంగా నిర్వహించనుంది. యువతీ యువకులు ఎంతో ఉత్సాహంగా పాల్గొనే ఈ కార్యక్రమం నిర్వాహకులుగా దిలీప్ సోని వైస్ ప్రెసిడెంట్ మరియు యు ఏ ఇ లో పరాజయ సోని కమ్యూనిటీ అధ్యక్షుడు హస్ముఖ్ దానక్ ఈ కార్యక్రమంను యుఎఇ లో ప్రజా సంబంధాల అధికారిగా ఓవిలియా ఫెర్నాండెజ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రెండు నుంచి 3 వేల మంది పని రోజులలో దాండియా ఆటలలో పాల్గొంటారని సెలవు రోజులలో, ఈ సంఖ్య దాదాపు 7 వేల నుంచి 8 వేల వరకు సగటు సమూహాలు ఆనంద ఉత్సాహాలతో దాండియా కొనసాగించనున్నారు.రోజూవారీగా 50 నుంచి 60 వరకు పలు బహుమతులను వివిధ విభాగాలలో ఇవ్వనున్నట్లు నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఉత్తమ నాట్యం,మంచి దుస్తులను ధరించినవారు ,ఉత్తమ జంట తదితర అన్ని వయసుల వారికి అదే రోజున అందిస్తామని వారు తెలిపారు. 9 రోజుల కాలవ్యవధిలో జరిగే దాండియా కార్యక్రమంకు 211 మంది వరకు పాల్గొననున్నారు. ఈ పోటీలో14 మంది విజేతలని ఎంపిక చేయనున్నారు. అలాగే పాల్గొనేవారందరికి ఏకీకరణ ( కన్సోలేషన్ ) బహుమతులను నిర్వాకులు అందచేయనున్నారు.








తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









