భారత ప్రెసిడెంట్‌ని కలిసిన ఖతార్‌ బృందం

- October 14, 2016 , by Maagulf
భారత ప్రెసిడెంట్‌ని కలిసిన ఖతార్‌ బృందం

భారత ప్రెసిడెంట్‌ ప్రణబ్‌ ముఖర్జీతో ఖతార్‌ ప్రతినిథి బృందం సమావేశమయ్యింది. ఈ సందర్భంగా ఖతార్‌ అంబాసిడర్‌ మొహమ్మద్‌ బిన్‌ కాతిర్‌ అల్‌ ఖాతిర్‌ సేవల్ని ప్రణబ్‌ ముఖర్జీ ప్రస్తావించారు. ఖతార్‌ ప్రతినిథి బృందం, ఎమిర్‌ షేక్‌ తమీమ్‌ బిన్‌ హమాద్‌ అల్‌ థని అందించిన విషెస్‌ని, ప్రణబ్‌ ముఖర్జీకి తెలియజేశారు. ప్రణబ్‌ ముఖర్జీ కూడా, ప్రతినిధి బృందం ద్వారా ఎమిర్‌ షేక్‌కి విషెస్‌ తెలిపారు. ఖతార్‌ ప్రజలకు ప్రణబ్‌ ముఖర్జీ శుభాకాంక్షలు అందజేయగా, భారత ప్రజలకు ఎమిర్‌ షేక్‌ కృతజ్ఞతలు తెలియజేశారని ఖతార్‌ ప్రతినిథి బృందం వెల్లడించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com