యు.ఏ.ఈ జాతీయులు నుండి 199 సజీవ నక్షత్ర తాబేళ్లు స్వాధీనం
- October 15, 2016
తొమ్మిది సజీవ నక్షత్ర తాబేళ్లను అక్రమ రవాణా చేస్తున్న యుఎఇ పాస్పోర్ట్ కల్గిన ఇరువురు వ్యక్తులను భారతదేశం ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (AIU) అధికారులు గురువారం రాత్రి అదుపులోనికి తీసుకొన్నారు. వారికి చెందిన నాలుగు ట్రాలీలను తనిఖీ చేస్తున్న సమయంలో పెద్ద సంచులలో 199 బతికి ఉన్న నక్షత్ర తాబేళ్లను గుర్తించారు. ఇరువురిపై అధికారులు కేసుని నమోదు చేశారు.
ఇద్దరు ప్రయాణీకులలో ఒకరి పేరు ఎం.ఏ కాగా మరొక వ్యక్తి పేరు ఎస్ ఐ గా అధికారులు తెలిపారు. ముంబై లో ఈ నక్షత్ర తాబేళ్లని కొనుగోలు చేసి వాటిని అక్రమంగా యు ఏ ఇ తరలించే యత్నంలో అధికారులకు దొరికిపోయారు. ఒక సీనియర్ అధికారి ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ తాబేళ్లు జాతిని గుర్తించదానికి రాష్ట్ర అటవీ శాఖ సహాయం కోరామని చెప్పారు. ఈ అక్రమ రవాణా వన్యప్రాణుల చట్టం యొక్క పరిధి కింద వస్తాయిని ఈ తరహా తాబేళ్ల ఎగుమతి మరియు దిగుమతి భారతదేశం నుండి నిషేధించబడ్డాయని ఆయన తెలిపారు.ఈ తాబేళ్లను ఇరుకైన సంచులలో బంధించి ఇటువంటి అక్రమ రవాణా చేస్తున్న సమయంలో అనేక ప్రాణులు మరణిస్తున్న సందర్భాలు అనేకమని ఆ అధికారి " మా గల్ఫ్ డాట్ కామ్ " ప్రతినిధికి తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







