ఉత్తర్ప్రదేశ్‌లో విషాదం: 14మంది మృతి

- October 15, 2016 , by Maagulf
ఉత్తర్ప్రదేశ్‌లో విషాదం: 14మంది మృతి

ఉత్తర్ప్రదేశ్‌లో విషాదం చోటుచేసుకుంది. వారణాశి- చందౌలి మధ్య రాజ్‌ఘాట్‌ వంతెనపై జరిగిన తొక్కిసలాటలో 14మంది మృతి చెందారు. బాబా జైగురుదేవ్‌ సభ సందర్భంగా జరిగిన ఈ తొక్కిసలాటలో పలువురు గాయపడ్డారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఈ విషాదంలో మృత్యువాత పడిన వారి కుటుంబాలకు యూపీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2లక్షలు, తీవ్ర గాయాలపాలైన వారికి ఒక్కొక్కరికి రూ.50వేలు చొప్పున పరిహారం ప్రకటించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com