ప్రౌన్ మలై కర్రీ
- October 15, 2016
కావలసినవి: రొయ్యలు- 500గ్రా., కొబ్బరి పాలు - రెండు కప్పులు, పెద్ద ఉల్లిపాయ (మందంగా తరిగినది) - ఒకటి , మరో ఒక పెద్ద ఉల్లిపాయముద్ద మెత్తగా రుబ్బినది, అల్లం ముద్ద ఒక టీ స్పూన్, ఒకటిన్నర టీ స్పూన్ కారం, అర టీ స్పూను పసుపు, బిరంజి ఆకులు రెండు, లవంగాలు నాలుగు, యాలకులు మూడు, దాల్చిన చెక్క ఒకటి, ఒకటిన్నర టీ స్పూను పంచదార, రెండు టేబుల్ స్పూనులు నెయ్యి, పచ్చి మిరపకాయలు మూడు లేక నాలుగు(ముక్కలుగా తరిగినది) గుప్పెడు కొత్తిమీర తరిగినది అలంకరణ కోసం... ఉప్పు తగినంత.
తయారీ విధానం:
మందపాటి గిన్నెలో నెయ్యిని వేడి చేసి బిరంజి ఆకులు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసి అరనిమిషం వేగించండి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి అందులో అల్లం ముద్ద, కారం, పసుపు వేసి తిప్పండి. నెయ్యి పైకి తేలిన తరువాత అందులో రొయ్యలు వేసి రెండు నిమిషాలపాటు వేగించండి. తర్వాత కొబ్బరిపాలు, పంచదార, ఉప వేసి బాగా ఉడికించండి. రొయ్యలు ఉడికాయని అనిపించిన తరువాత మూత పెట్టి సన్నని సెగ మీద పది నిమిషాలు ఉంచండి. కొత్తిమీర, పచ్చిమిరపముక్కలతో అలంకరించి వేడి వేడి అన్నంతో తింటే ప్రాన్ మలై కర్రీ చాలా రుచిగా ఉంటుంది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







