ఒడిషాలో భారీ అగ్నిప్రమాదం
- October 17, 2016
ఒడిషాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. భువనేశ్వర్లోని ఐఎంఎస్ & ఎస్యూఎం ఆస్పత్రిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో దాదాపు 22 మంది మృతి చెందగా, 75 మందికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఐసీయూ వార్డులో కూడా మంటలు వ్యాపించాయి. దీంతో ఆ వార్డులో కదలలేని స్థితిలో ఉన్న వారు అక్కడికక్కడే కాలిపోయారు. మొదట డయాలసిస్ వార్డులో మంటలు చెలరేగి, మెడిసిన్, ఐసీయూ వార్డులకు మంటలు వ్యాపించాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, 5 అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పుతున్నారు. చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు రూ. 5 లక్షలు, క్షతగాత్రుల కుటుంబాలకు రూ.50వేలు పరిహారాన్ని అందిస్తామని రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. షాక్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. క్షతగాత్రుల్లో కొంత మంది పరిస్థితి విషమంగా మారింది. మృతులు, క్షతగాత్రుల వివరాలను తమకు పంపాలంటూ కేంద్రం తెలిపింది.
ఐసీయూలో ఉన్నవారు కూడా చనిపోయిన వ్యక్తుల్లో ఉండటం గమనార్హం. 9ఫైరింజన్లు మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









