వింటర్ హెచ్చరిక: సైక్లిస్టులూ జాగ్రత్త
- October 18, 2016
మనామా: వింటర్ వస్తుండడంతో ఔత్సాహిక సైక్లిస్ట్లు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. వాతావరణ మార్పుల కారణంగా సైక్లిస్టులు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంటుంది గనుక సైక్లిస్టులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సదరన్ ఏరియా మునిసిపల్ కౌన్సిల్ ఛైర్మన్ అహ్మద్ అన్సారి మాట్లాడుతూ, వింటర్ సీజన్లో సైక్లిస్టులు రద్దీగా ఉండే రోడ్లపై అప్రమత్తంగా ఉండాలని, సైకిల్స్తో ఎలాంటి స్టంట్స్ చేయకూడదని ఆయన హెచ్చరించారు. రోడ్లపై స్టంట్స్ చేసే సైక్లిస్టులపై తగిన చర్యలు ఉంటాయని ఆయన తెలిపారు. ఈ ఏడాది ఇప్పటిదాకా 8 మంది సైక్లిస్టులు మృతి చెందారు. పలువురు గాయాలపాలయ్యారు. సైక్లింగ్ని ప్రోత్సహించాల్సి ఉందనీ, సైక్లింగ్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, అయితే దాన్ని స్టంట్స్ కోసం వినియోగిస్తుండడంతోనే సమస్యలు వస్తున్నాయని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







