ఢిల్లీలో యూఏఈ వీసా జారీ కేంద్రం
- October 18, 2016
న్యూఢిల్లీ: కొత్త ఓవర్సీస్ కాన్సులర్ సెక్షన్ని వీసా మంజూరు కోసం యూఏఈ ఢిల్లీలో ఏర్పాటు చేసింది. కాన్సులర్ సెక్షన్, ఎమిరేటీ వీసాల్ని ఇండియన్స్ మరియు ఇండియాలో నివసిస్తున్నవారి కోసం మంజూరు చేయనుంది. యూఏఈలోని ఇండియన్ వర్కర్స్కి ఇది ఎంతో ఉపయుక్తంగా ఉండనుంది. యూఏఈకి సంబంధించినంతవరకు ఇది ఆరవ ఓవర్సీస్ సెంటర్. మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ మొహమ్మద్ మిర్ అబ్దుల్లా అల్ రైసి ఈ సెంటర్ని ప్రారంభించారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, పలువురు ఎమిరేటీ మరియు ఇండియన్ అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. యూఏఈ మరియు ఇండియా మధ్య సంబంధాలు మరింతగా విస్తరించేందుకు ఇరు ప్రభుత్వాలూ ఎంతో ఆసక్తి చూపుతున్నాయని ఈ సందర్భంగా అల్ రైసి చెప్పారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







