బ్రెయిన్‌డెడ్ అయిన వంశీకృష్ణ అవయవాలను దానం..

- October 18, 2016 , by Maagulf
బ్రెయిన్‌డెడ్ అయిన వంశీకృష్ణ అవయవాలను దానం..

జిల్లాలోని ఆంధ్రా ఆస్పత్రిలో బ్రెయిన్‌డెడ్ అయిన వంశీకృష్ణ అవయవాలను దానం చేసేందుకు అతని తల్లిదండ్రులు ముందుకు వచ్చారు. జీవన్‌దాన్ ట్రస్ట్ ద్వారా వంశీకృష్ణ కళ్లు, కిడ్నీలు విజయవాడ ఆస్పత్రికి గుండె, కాలేయం హైదరాబాద్‌కు తరలించేందుకు వైద్యులు ఏర్పాట్లు చేశారు. గ్రీన్‌చానెల్ ద్వారా గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి హైదరాబాద్‌కు తరలించనున్నారు.కృష్ణా జిల్లా జగయ్యపేటకు చెందిన వంశీకృష్ణ మండవ ఇంజనీరింగ్ కళాశాలలో నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేస్తున్నాడు. మూడు రోజుల క్రిందట అనారోగ్యంతో ఆంధ్రా ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతున్న సమయంలో వంశీకి బ్రెయిన్‌డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com