బహ్రెయిన్ ఇండియా వీక్ 2016
- October 19, 2016
డిసెంబర్ 1న బహ్రెయిన్ ఇండియా వీక్ పేరుతో రెండు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు మరింత పెరిగేందుకు ఓ గ్రాండ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు బహ్రెయిన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (బిసిసిఐ) వెల్లడించింది. ఇరుదేశాల్లోని పలు ప్రముఖ సంస్థలు ఈ ఈవెంట్లో పాల్గొని, ఇరు దేశాల్లోనూ చేపట్టే పలు ప్రాజెక్టులపై చర్చించుకుంటాయని ప్రతినిథులు స్పష్టం చేశారు. బి టు బి ఎగ్జిబిషన్ డిసెంబర్ 1 మరియు 2 తేదీల్లో బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్లోని 2వ హాల్లో జరుగుతుంది. ఈ ఈవెంట్ ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్సటర్నల్ ఎఫైర్స్ అలాగే ఎంబసీ ఆఫ్ ఇండియా ఇన్ బహ్రెయిన్, బహ్రెయిన్ మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ, కామర్స్ మరియు టూరిజం మద్దతుతో నిర్వహించబడుతోంది. బహ్రెయిన్కి చెందిన పిఆర్ఎం మార్కెటింగ్ కన్సల్టెన్సీ ఈ ఈవెంట్ని నిర్వహిస్తోంది. ఎస్ఎంఇ మరియు మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లో టెక్నాలజీ మార్పిడిపై బి టు బి ఫోకస్ పెట్టనుంది. ఈ ఈవెంట్లో ఫుడ్ కోర్ట్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







