సైకిళ్ళపై పెట్రోలింగ్ని ప్రారంభించిన పోలీస్
- October 20, 2016
అబుదాబీ పోలీసులు, సైకిల్ పెట్రోల్ టీమ్స్ని పునరుద్ధరించాయి. రెసిడెన్షియల్ మరియు కమర్షియల్ ప్రాంతాల్లో ఈ సైకిల్ పెట్రోల్ టీమ్స్ తమ సేవల్ని సమర్థవంతంగా నిర్వహించనున్నాయి. త్వరలో ఈ సేవల్ని మరింతగా విస్తరిస్తామని అబుదాబీ పోలీస్ వర్గాలు వెల్లడించాయి. పూర్తిస్థాయిలో ఎక్విప్మెంట్తో కూడిన పెట్రోల్ టీమ్ సైకిల్స్పై విదులను నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. అబుదాబీ పోలీస్ చీఫ్ కమాండర్ మేజర్ జనరల్ మొహమ్మద్ ఖల్ఫాన్ అల్ రుమైతి మాట్లాడుతూ, అబుదాబీ పోలీసులు మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారనీ, సొసైటీలో భద్రత అలాగే శాంతికి కట్టుబడి ఉన్నామని అన్నారు. నేరాల్ని తగ్గించడంలో ఈ సైకిల్ పెట్రోల్ టీమ్స్ ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని వివరించారాయన. 'వి ఆర్ ఆల్ పోలీస్', 'హార్స్ నైట్స్' వంటి విభిన్నమైన కార్యక్రమాలతో అబుదాబీ పోలీసులు ప్రజలకు మరింత చేరువవుతున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







