ఒప్పందాన్ని అతిక్రమించినందుకు పాక్ కు బుద్ధి చెప్పిన భారత్ జవ్వాన్లు
- October 21, 2016
భారత్ - పాక్ సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్తాన్ రేంజర్లకు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జవాన్లు శుక్రవారం నాడు గట్టి షాక్ ఇచ్చారు. పాక్ ఎప్పటికప్పుడు ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. తాజాగా, ఈ రోజు జమ్ములోని హీరా నగర్ సెక్టారులో బీఎస్ఎఫ్ పోస్టుల పైన పాకిస్తాన్ సైన్యం కాల్పులకు తెగబడింది. దీంతో రంగంలోకి దిగిన భారత్ ఆర్మీ పాక్ సైన్యం కాల్పులను ధీటుగా ఎదుర్కొంది. బీఎస్ఎఫ్ దళాలు జరిపిన కాల్పుల్లో ఒక ఉగ్రవాది, ఏడుగురు పాక్ రేంజర్లు హతమయ్యారు. తద్వారా, సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచిన పాకిస్థాన్కు భారత బలగాలు దిమ్మతిరిగే సమాధానం చెప్పాయి. కాగా, ఈ ఘటనలో ఓ బీఎస్ఎఫ్ జవానుకు గాయపడ్డాడు. కాగా, ఇండియన్ ఆర్మీకి కేంద్రం పూర్తి స్వేచ్ఛను ఇచ్చిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









