జైషే ఉగ్రవాదులు.. సఫీర్ అహ్మద్ భట్, ఫర్హాన్ ఫయాజ్ను అరెస్ట్..
- October 22, 2016
భారీ ఉగ్ర కుట్రను భారత నిఘా సంస్థ లు ఛేదించాయి. జమ్మూకశ్మీర్లోని బారాముల్లాలో ఇద్దరు జైషే మహ్మద్ ఉగ్రవాదులను శుక్రవారం అర్థరాత్రి జరిపిన గాలింపు చర్యల్లో అదుపులోకి తీసుకున్నాయి. జైషే ఉగ్రవాదులు.. సఫీర్ అహ్మద్ భట్, ఫర్హాన్ ఫయాజ్ను అరెస్ట్ చేసి వారి నుంచి పెద్ద ఎత్తున ఏకే-47లను, గ్రెనేడ్లను స్వాధీనం చేసుకొన్నాయి. ఈ ఏడాది ఆగస్టులో బారాముల్లాలో ఇద్దరు జవాన్లను, పోలీసును హతమార్చిన ఘటనలో వీరు నిందితులని అధికారు లు వెల్లడించారు. కాగా, సాంబ సెక్టార్లో బోధ్రాజ్ అనే పాక్ గూఢచారిని అదుపులోకి తీసుకొన్నారు. అతని వద్ద నుంచి పాక్ సిమ్ కార్డులను, భారత సైన్యం మోహరింపునకు సంబంధించిన మ్యాపును స్వాధీనం చేసుకొన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







