జైషే ఉగ్రవాదులు.. సఫీర్‌ అహ్మద్‌ భట్‌, ఫర్హాన్‌ ఫయాజ్‌ను అరెస్ట్‌..

- October 22, 2016 , by Maagulf
జైషే ఉగ్రవాదులు.. సఫీర్‌ అహ్మద్‌ భట్‌, ఫర్హాన్‌ ఫయాజ్‌ను అరెస్ట్‌..

భారీ ఉగ్ర కుట్రను భారత నిఘా సంస్థ లు ఛేదించాయి. జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లాలో ఇద్దరు జైషే మహ్మద్‌ ఉగ్రవాదులను శుక్రవారం అర్థరాత్రి జరిపిన గాలింపు చర్యల్లో అదుపులోకి తీసుకున్నాయి. జైషే ఉగ్రవాదులు.. సఫీర్‌ అహ్మద్‌ భట్‌, ఫర్హాన్‌ ఫయాజ్‌ను అరెస్ట్‌ చేసి వారి నుంచి పెద్ద ఎత్తున ఏకే-47లను, గ్రెనేడ్లను స్వాధీనం చేసుకొన్నాయి. ఈ ఏడాది ఆగస్టులో బారాముల్లాలో ఇద్దరు జవాన్లను, పోలీసును హతమార్చిన ఘటనలో వీరు నిందితులని అధికారు లు వెల్లడించారు. కాగా, సాంబ సెక్టార్‌లో బోధ్‌రాజ్‌ అనే పాక్‌ గూఢచారిని అదుపులోకి తీసుకొన్నారు. అతని వద్ద నుంచి పాక్‌ సిమ్‌ కార్డులను, భారత సైన్యం మోహరింపునకు సంబంధించిన మ్యాపును స్వాధీనం చేసుకొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com