ప్రపంచ సైబర్ దాడుల తరువాత కతర్ లో ఇంటర్నెట్ సమస్యలు
- October 23, 2016
ఖతార్ అంతటా శుక్రవారం ఉదయం ఇంటర్నెట్ వినియోగదారులు కొన్ని ప్రముఖంగా ఉపయోగించే సైట్లు మీద విస్తృతమైన సమస్యలు తలెత్తినట్లు నివేదించారు. కారణం ఈ సమయంలో ఊరెడూ కానీ ఒక ప్రపంచ సైబర్ దాడి కతర్ లో వినియోగదారుల పేస్ బుక్ , ఇంస్టాగ్రామ్ మరియు స్నాప్ఛాట్ ఏవైనా సమస్యలు కానీ చిత్రాలను వాట్సాప్ నుండి డౌన్లోడ్ చేసుకోవడం లేదని గమనించారు. వాట్సాప్ ఇంతేకాక, ట్విట్టర్, రెడ్డీస్ మరియు నెట్ఫ్లిక్స్ వంటి గుర్తించదగిన సైట్లు నుంచి క్లుప్తంగా శుక్రవారం వాటిపై దాడి చేశారు కోర్ వెబ్ యంత్రాంగాలు ఇచ్చే ఒక సంస్థ డీన్ అన్వేషిస్తున్నారు. సైబర్ నేరాల వల్ల వ్యక్తిగతంగా నష్టం జరుగుతోంది. విలువైన పేటెంట్లు చోరీ చేయడం, ఆర్థిక సంస్థలను మోసం చేయడం, బ్యాంకు ఖాతాలను హ్యాక్ చేసి నిధులు మళ్లించడం, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డుల నుంచి చోరీ, ఇతర అన్ని రకాల సైబర్ నేరాల వల్ల ప్రపంచ దేశాలు ఏటా 35,500 కోట్ల నుంచి లక్ష కోట్ల డాలర్ల వరకు నష్టపోతున్నాయని అంచనా.. ఇంటర్నెట్ ఆధారంగా జరిగే వ్యక్తిగత, ఆర్థిక, భద్రత పరమైన నేరాలను సైబర్ నేరాలు అంటారు. ఇంటర్నెట్ మాధ్యమం ద్వారా ప్రైవసీని భగ్నం చేయడం, బ్యాంకు ఖాతాలను ఖాళీ చేయడం, భద్రతకు ముప్పు కలిగించడం చేస్తున్నారు. ఈ నేరాలు ప్రత్యక్షంగా కాకుండా ఆన్ లైన్ ద్వారా సైబర్ క్షేత్రంలో జరుగుతాయి. ఈ నేరాలకు పాల్పడేవారెవరో గుర్తించడం అత్యంత కష్టం. వీటి తీవ్రతకు ప్రపంచ దేశాలన్ని వణికిపోతున్నాయి. రోజురోజుకీ నేరాల తీవ్రత ఊహించనంత వేగంతా విస్తరిస్తోంది.
ఆధునిక పంథాలో అకౌంట్ టేకోవర్: ఇటీవల ఎక్కువగా నమోదయ్యే నేరాలు అకౌంట్ టేకోవర్కు సంబంధించినవే. ఈ సైబర్ నేరగాళ్లు వ్యాపార లావాదేవీలు జరిపే వారి ఈ-మెయిల్స్ ను హ్యాక్ చేస్తారు. అన్ సెక్యూర్డ్ ఈ-మెయిల్ ఐడీల లావాదేవీలను కొంతకాలం పరిశీలిస్తారు. అదును చూసుకుని నగదు చెల్లించాల్సిన వ్యక్తికి, నగదు తీసుకునే వ్యక్తిలా మెయిల్ పంపిస్తారు. బ్యాంక్ ఖాతా మారిందంటూ తమ ఖాతాను మెయిల్లో పొందుపరుస్తారు. దీంతో చెల్లింపులు సైబర్ నేరగాడి ఖాతాలోకి వస్తాయి. అందుకే ఖాతాలు మారినట్టుగా సమాచారం వస్తే అవతలి వ్యక్తిని నేరుగా సంప్రదించి నిర్ధారించుకున్న తరవాతే డిపాజిట్ చేయడం ఉత్తమం.
దురాశ వద్దు: సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్ వంటి చోట్ల ఏదో ఒక సర్వే చేస్తున్నామని నమ్మబలుకుతుంటారు. ఈ-మెయిల్ ఐడీ, సెల్ఫోన్ నెంబరు రాసి డబ్బాలో వేస్తే డ్రా తీసి బహుమతి ఇస్తామని కూడా ఆశపెడతారు. అలాంటి వారికి వివరాలిస్తే, ఇబ్బందే. వారి దగ్గర నుంచి ఈ వివరాలను సైబర్ నేరగాళ్లు కొనేసి తమ పని కానిస్తుంటారు.
ఒక్క మెయిల్ తో ఖాతా ఖాళీ: మేం ఫలానా బ్యాంకు నుంచి మెయిల్ చేస్తున్నాం. భద్రతా చర్యల్లో భాగంగా అందరి వివరాలూ తనిఖీ చేస్తున్నాం. మీ అకౌంట్ నెంబర్, పాస్వర్డ్ చెప్తే ఎవరూ టాంపర్ చేయకుండా చర్యలు తీసుకుంటాం. అంటూ వచ్చే ఈ-మెయిల్కు స్పందిస్తే ఖాతా ఖాళీ అయిపోయినట్లే. ప్రపంచ వ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు రోజుకు ఇలా 98 లక్షల ఫిషింగ్ మెయిల్స్ పంపుతున్నట్లు అంచనా. ఇక ఎస్ఎమ్మెస్లో ఇలా వచ్చే సందేశాన్ని స్మిషింగ్ అంటారు.
కీ లాగర్స్: కంప్యూటర్ ద్వారా జరిపే ప్రతి లావాదేవీని తెలుసుకునేందుకు కీ లాగర్స్ అనే సాఫ్ట్ వేర్ వాడుతున్నారు. కంప్యూటర్ను వినియోగించిన వారు ఏ సమాచారం టైప్ చేశారో ఈ సాఫ్ట్ వేర్తో తెలుసుకోవచ్చు. నెట్ కేఫ్ల్లోని సిస్టమ్స్ లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. దీనితో కంప్యూటర్ను వాడుకున్న వారు టైప్ చేసిన సమాచారాన్ని తస్కరించి దుర్వినియోగం చేసే వాళ్లు పెరిగారు.
క్రెడిట్ కార్డుతో జాగ్రత్త: షాపు లేదా పెట్రోల్ బంక్ కు వెళ్లి, క్రెడిట్ కార్డుతో బిల్లు చెల్లించినపుడు కార్డు చెల్లింపు సమాచారానికి చెందిన ఒక కాపీ వారే ఉంచుకుంటారు. వారి దగ్గర ఉంచుకునే బిల్లు కాపీలో ఉన్న పేరు, కార్డు నెంబరు ఉంటాయి. కార్డు వెనుక ఉన్న సీవీవీ కోడ్ను అవతలి వ్యక్తులు నోట్ చేసుకుంటే. నెట్లో మీ ఖాతాతో వారు షాపింగ్ చేసుకోవచ్చు. ఒక్కోసారి స్కిమ్మర్లను వినియోగించి కార్డు డేటాను దొంగిలించి, మరో కార్డు తయారు చేసి జల్సా చేస్తున్నారు. అవగాహనే కీలకం ఈ కేసుల్లో నిందితులను పట్టుకోవడం దాదాపు అసాధ్యం కాబట్టి, వీటిపై కతర్ ప్రభుత్వం ప్రజల్లో అవగాహన కల్పించేలా కృషి చేస్తుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







