భారత్ తన తదుపరి మ్యాచ్లో జర్మనీతో తలపడనుంది.
- October 26, 2016
5వ నేషనల్ ఇన్విటేషనల్ హాకీ టోర్నమెంట్లో భారత జూనియర్ మహిళల జట్టు తన ఖాతాలో మరో విజయం నమోదు చేసుకుంది. స్పెయిన్తో జరిగిన మ్యాచ్లో భారత్ 3-2తేడాతో విజయాన్ని దక్కించుకుంది.ఆట ప్రారంభమైన 15వ నిమిషంలో స్పెయిన్ క్రీడాకారిణి క్లారా మొదటి గోల్ చేసి తన జట్టును ఆధిక్యంలోకి తీసుకెళ్లింది. 28వ నిమిషంలో భారత క్రీడాకారిణి జ్యోతి గోల్ చేయడంతో ఇరు జట్ల స్కోరు సమమైంది. 42వ నిమిషంలో పెనాల్టి కార్నర్ ద్వారా రీతూ గోల్ చేసి భారత్ను ఆధిక్యంలోకి తీసుకెళ్లింది. రెండు నిమిషాల వ్యవధిలోనే స్పెయిన్ క్రీడాకారిణి గోల్ చేయడంతో మరోసారి జట్టు స్కోరు సమమైంది.ఈ సమయంలో ఇరుజట్ల మధ్య పోరు హోరాహోరీగా సాగింది. చివరి 10నిమిషాల సమయంలో గోల్ చేసేందుకు భారత్ శాయశక్తులా కృషి చేసింది. ఈ క్రమంలో సంగీత కుమారి గోల్ చేయడంతో 3-2 ఆధిక్యంలోకి దూసుకెళ్లి స్పెయిన్పై విజయాన్ని నమోదు చేసింది.
భారత్ తన తదుపరి మ్యాచ్లో జర్మనీతో తలపడనుంది. ఈ మ్యాచ్ ఈ నెల 27న జరగనుంది.
తాజా వార్తలు
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !







