భారత్ తన తదుపరి మ్యాచ్లో జర్మనీతో తలపడనుంది.
- October 26, 2016
5వ నేషనల్ ఇన్విటేషనల్ హాకీ టోర్నమెంట్లో భారత జూనియర్ మహిళల జట్టు తన ఖాతాలో మరో విజయం నమోదు చేసుకుంది. స్పెయిన్తో జరిగిన మ్యాచ్లో భారత్ 3-2తేడాతో విజయాన్ని దక్కించుకుంది.ఆట ప్రారంభమైన 15వ నిమిషంలో స్పెయిన్ క్రీడాకారిణి క్లారా మొదటి గోల్ చేసి తన జట్టును ఆధిక్యంలోకి తీసుకెళ్లింది. 28వ నిమిషంలో భారత క్రీడాకారిణి జ్యోతి గోల్ చేయడంతో ఇరు జట్ల స్కోరు సమమైంది. 42వ నిమిషంలో పెనాల్టి కార్నర్ ద్వారా రీతూ గోల్ చేసి భారత్ను ఆధిక్యంలోకి తీసుకెళ్లింది. రెండు నిమిషాల వ్యవధిలోనే స్పెయిన్ క్రీడాకారిణి గోల్ చేయడంతో మరోసారి జట్టు స్కోరు సమమైంది.ఈ సమయంలో ఇరుజట్ల మధ్య పోరు హోరాహోరీగా సాగింది. చివరి 10నిమిషాల సమయంలో గోల్ చేసేందుకు భారత్ శాయశక్తులా కృషి చేసింది. ఈ క్రమంలో సంగీత కుమారి గోల్ చేయడంతో 3-2 ఆధిక్యంలోకి దూసుకెళ్లి స్పెయిన్పై విజయాన్ని నమోదు చేసింది.
భారత్ తన తదుపరి మ్యాచ్లో జర్మనీతో తలపడనుంది. ఈ మ్యాచ్ ఈ నెల 27న జరగనుంది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









