'ఆత్మాహుతి డ్రోన్'ను ఇరాన్ అభివృద్ధి చేసింది...
- October 26, 2016
: భారీ స్థాయిలో పేలుడు పదార్థాలను మోసుకెళ్లి ఢీ కొట్టడం ద్వారా లక్ష్యాలను నాశనం చేసే సరికొత్త 'ఆత్మాహుతి డ్రోన్'ను ఇరాన్ అభివృద్ధి చేసింది. ప్రాథమికంగా సముద్ర సంబంధిత నిఘా కోసం ఆ దేశ సైనిక విభాగం 'రెవల్యూషనరీ గార్డ్స్' దీన్ని రూపొందించినట్లు ఓ వార్తాసంస్థ వెల్లడించింది. అయితే, సముద్రంతోపాటు భూమిపైగల లక్ష్యాలనూ ఆత్మాహుతి దాడులతో ఛేదించే సామర్థ్యం దీనికి ఉందని పేర్కొంది. భారీస్థాయిలో పేలుడు పదార్థాలను ఇవి మోసుకెళ్లగలవని.. క్షిపణులను మాత్రం వీటి ద్వారా ప్రయోగించలేరని వివరించింది. నీటి ఉపరితలంపై కేవలం అర మీటరు ఎత్తులో గంటకు 250 కిలోమీటర్ల వేగంతో ఇవి ప్రయాణించగలవని పేర్కొంది.
అవసరాన్ని బట్టి 900 మీటర్ల ఎత్తు వరకూ ఎగురుతాయని సూచించింది. అమెరికాకు చెందిన ఆర్క్యూ-170 సెంటినల్ డ్రోన్ నిర్మాణం ఆధారంగా 'సీఘెహ్' అనే సరికొత్త డ్రోన్ను తాము రూపొందించినట్లు ఇరాన్ ఈ నెలారంభంలో ప్రకటించింది.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







