12 మంది బబ్బర్ ఖల్సా ఉగ్రవాదుల చొరబాటు
- October 27, 2016
దేశంలో పెద్దయెత్తున ఉగ్రదాడులు జరిపేందుకు బబ్బర్ ఖల్సా గ్రూపుకు చెందిన ఉగ్రవాదులు భారత్లోకి చొరబడినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు జారీచేశాయి. దాదాపు 12 మంది ఉగ్రవాదులు పంజాబ్లోకి అక్రమంగా ప్రవేశించారని, వీరు ఉత్తర భారతదేశంలో దాడులు చేసేందుకు యత్నించే అవకాశం ఉందని ముందస్తు హెచ్చరికలు జారీచేశాయి. దీంతో పంజాబ్లో హైఅలర్ట్ను ప్రకటించారు. ఈనెల 23న పంజాబ్లో అనుమానిత ఉగ్రవాది కమల్దీప్ సింగ్ని విచారించగా ఈ విషయాన్ని వెల్లడించినట్లు ఐబీ అధికారులు తెలిపారు.
ఉగ్ర కార్యకలాపాలు నిర్వహించేందుకు 12 మంది పాకిస్థాన్లో శిక్షణ పొందిన ఉగ్రవాదులు భారత్లోకి ప్రవేశించినట్లు అధికారులు తెలిపారు.
ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో పంజాబ్ రాష్ట్ర డీజీపీ... సీనియర్ పోలీసు అధికారులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. సరిహద్దు ప్రాంతాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ముమ్మరంగా తనిఖీలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
తాజా వార్తలు
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు
- ఇరాన్ దాడిలో ఒకరు మృతి.. 63 మందికి గాయాలు, అత్యవసర పరిస్థితిలో కువైట్ ఆసుపత్రులు
- వేస్ట్ మేనేజ్మెంట్ లో గణనీయంగా తగ్గిన ఉల్లంఘనలు..!!
- ఒమన్ లో భానుడి ప్రతాపం.. 50 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- ప్రజలకు కీలక సూచనలు చేసిన కువైట్ సైన్యం..!!
- షార్జా బాలుడి మృతి కేసులో నేబర్ ఫ్యామిలీలకు బెయిల్..!!
- ఖతార్ లో పర్సనల్ డేటా ప్రైవసీ.. పరిరక్షణకు NCSA ఫ్రేమ్వర్క్ ఆవిష్కరణ..!!
- బ్రెయిన్ ట్యూమర్ ను గుర్తించడంలో వైఫల్యం.. డాక్టర్ కు ఫైన్..!!









