12 మంది బబ్బర్ ఖల్సా ఉగ్రవాదుల చొరబాటు
- October 27, 2016
దేశంలో పెద్దయెత్తున ఉగ్రదాడులు జరిపేందుకు బబ్బర్ ఖల్సా గ్రూపుకు చెందిన ఉగ్రవాదులు భారత్లోకి చొరబడినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు జారీచేశాయి. దాదాపు 12 మంది ఉగ్రవాదులు పంజాబ్లోకి అక్రమంగా ప్రవేశించారని, వీరు ఉత్తర భారతదేశంలో దాడులు చేసేందుకు యత్నించే అవకాశం ఉందని ముందస్తు హెచ్చరికలు జారీచేశాయి. దీంతో పంజాబ్లో హైఅలర్ట్ను ప్రకటించారు. ఈనెల 23న పంజాబ్లో అనుమానిత ఉగ్రవాది కమల్దీప్ సింగ్ని విచారించగా ఈ విషయాన్ని వెల్లడించినట్లు ఐబీ అధికారులు తెలిపారు.
ఉగ్ర కార్యకలాపాలు నిర్వహించేందుకు 12 మంది పాకిస్థాన్లో శిక్షణ పొందిన ఉగ్రవాదులు భారత్లోకి ప్రవేశించినట్లు అధికారులు తెలిపారు.
ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో పంజాబ్ రాష్ట్ర డీజీపీ... సీనియర్ పోలీసు అధికారులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. సరిహద్దు ప్రాంతాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ముమ్మరంగా తనిఖీలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







