భారత దేశ రాజధాని లో ఇద్దరు ఐ.ఎస్.ఐ. ఏజెంట్ల అరెస్ట్
- October 27, 2016పాకిస్తాన్ భారత వ్యతిరేక చర్యలు శ్రుతిమించుతున్నాయి. ఉగ్రవాదులను ప్రేరేపించడం, సరిహద్దుల్లో కాల్పులకు పాల్పడటంతో పాటు ఏకంగా ఢిల్లీలో గూఢచర్యం కూడా జరుగుతోంది. పాక్ రాయబార కార్యాలయ ఉద్యోగి అరెస్టుతో ఈ విషయం బయటపడింది. గూఢచర్యానికి పాల్పడుతున్నాడనే అనుమానంతో అక్తర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద రక్షణ శాఖకు చెందిన రహస్య పత్రాలు లభించాయి. BSD బలగాల కదలికలకు సంబంధించిన సమాచారం ఆ పత్రాల్లో ఉండటంతో అతడిని పోలీసులు ప్రశ్నించారు. అయితే దౌత్య సిబ్బంది కావడంతో ప్రశ్నించి వదిలిపెట్టారు. అతడిని భారత్ విడిచి పెళ్లాలని ఆదేశించారు. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న భారత విదేశాంగ శాఖ, పాక్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ ను సమన్లు జారీచేసింది. ఆయన్ని పిలిపించుకుని ప్రశ్నించింది. పాక్ దౌత్య కార్యాలయం పనితీరుపై బాసిత్ పై ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలుస్తోంది. మరోవైపు, పాకిస్తాన్ ISI గూఢచారులుగా పనిచేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారిద్దరూ రాజస్థాన్ కు చెందిన వారు. వారిని ఢిల్లీ క్రైం బ్రాంచ్ హెడ్ క్వార్టర్స్ లో పోలీసులు విచారిస్తున్నారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల పర్వం..
- కాంగ్రెస్ పార్టీ నేషనల్ స్టార్ క్యాంపెయినర్గా కీలక బాధ్యతలు
- అయోధ్యలోని బాల రాముడి నుదుటిపై తిలకం దిద్దిన సూర్య భగవానుడు
- భారీ వర్షాలు..ఎమిరేట్స్ ప్రయాణికులకు చెక్-ఇన్ నిలిపివేత
- ఒమన్లో భారీ వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం
- తూర్పు ప్రావిన్స్లో భారీ వర్షం.. రియాద్లో అలెర్ట్ జారీ
- భారీ వర్షాలతో విద్యుత్, ఇంటర్నెట్,మంచినీటి సమస్యలు..!
- దుబాయ్ లో మెట్రో సేవలకు అంతరాయం
- సాల్మియాలో ఇద్దరు ప్రవాసులు అరెస్ట్
- భద్రాద్రిలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం..