భారత దేశ రాజధాని లో ఇద్దరు ఐ.ఎస్.ఐ. ఏజెంట్ల అరెస్ట్
- October 27, 2016
పాకిస్తాన్ భారత వ్యతిరేక చర్యలు శ్రుతిమించుతున్నాయి. ఉగ్రవాదులను ప్రేరేపించడం, సరిహద్దుల్లో కాల్పులకు పాల్పడటంతో పాటు ఏకంగా ఢిల్లీలో గూఢచర్యం కూడా జరుగుతోంది. పాక్ రాయబార కార్యాలయ ఉద్యోగి అరెస్టుతో ఈ విషయం బయటపడింది. గూఢచర్యానికి పాల్పడుతున్నాడనే అనుమానంతో అక్తర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద రక్షణ శాఖకు చెందిన రహస్య పత్రాలు లభించాయి. BSD బలగాల కదలికలకు సంబంధించిన సమాచారం ఆ పత్రాల్లో ఉండటంతో అతడిని పోలీసులు ప్రశ్నించారు. అయితే దౌత్య సిబ్బంది కావడంతో ప్రశ్నించి వదిలిపెట్టారు. అతడిని భారత్ విడిచి పెళ్లాలని ఆదేశించారు. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న భారత విదేశాంగ శాఖ, పాక్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ ను సమన్లు జారీచేసింది. ఆయన్ని పిలిపించుకుని ప్రశ్నించింది. పాక్ దౌత్య కార్యాలయం పనితీరుపై బాసిత్ పై ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలుస్తోంది. మరోవైపు, పాకిస్తాన్ ISI గూఢచారులుగా పనిచేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారిద్దరూ రాజస్థాన్ కు చెందిన వారు. వారిని ఢిల్లీ క్రైం బ్రాంచ్ హెడ్ క్వార్టర్స్ లో పోలీసులు విచారిస్తున్నారు.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







