ఆస్ట్రేలియాలో దారుణం చోటుచేసుకుంది..
- October 28, 2016
ఆస్ట్రేలియాలో దారుణం చోటుచేసుకుంది. భారతీయ సంతతికి చెందిన ఓ బస్సు డ్రైవర్పై ఓ ప్రయాణికుడు తేలికగా మండే ద్రావకంతో దాడిచేయడంతో మంటలు వ్యాపించి సజీవ దహనమయ్యాడు. మృతుడు మన్మీత్ అలీషర్ బ్రిస్బేన్లోని పంజాబీ జాతీయుల్లో పేరుగాంచిన సింగర్ కావడం గమనార్హం. అకస్మాత్తుగా, అనూహ్య రీతిలో జరిగిన ఈ ఘటనతో బస్సులో మంటలు వ్యాపించాయి. భయభ్రాంతులకు గురైన ప్రయాణికులు అద్దాలు పగులగొట్టి బయటపడ్డారు. మరికొంతమందిని స్థానికులు రక్షించడంతో ప్రాణనష్టం చోటుచేసుకోలేదు. దిగ్భ్రాంతిని కలిగించే ఈ ఘటన వెనుక జాత్యహంకార కోణం లేదని పోలీస్ కమిషనర్ ఇయాన్ స్టివార్ట్ వెల్లడించారు. ఈ ఘటనలో బస్సులో మంటలు వ్యాపించకపోవడంతో ప్రాణనష్టం పెరగలేదని ఆయన పేర్కొన్నారు.48 ఏళ్ల అనుమానితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







