పోలీసులపై దాడి: ముగ్గురికి జైలు

- October 28, 2016 , by Maagulf
పోలీసులపై దాడి: ముగ్గురికి జైలు

మనామా: సుప్రీం అప్పీల్‌ కోర్ట్‌, ముగ్గురు వ్యక్తులకు విధింపబడిన పదేళ్ళ జైలు శిక్షను ఐదేళ్ళకు కుదించింది. కింది కోర్టు వారికి 10 ఏళ్ళు జైలు శిక్ష విధించగా, సుప్రీం అపీల్స్‌ కోర్ట్‌ ఆ శిక్షను ఐదేళ్ళకు కుదిస్తూ తీర్పునిచ్చింది. ఖామిస్‌ పోలీస్‌ స్టేషన్‌పై జరిగిన దాడిలో ఈ ముగ్గురినీ నిందితులుగా న్యాయస్థానం గుర్తించింది. పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు పోలీస్‌ స్టేషన్‌పై దాడి చేశారు. ఈ ఘటనలో ఆ ముగ్గురూ పాల్గొన్నట్లు పోలీసులు సాక్ష్యాలు సేకరించారు. ఈ దాడిలో పోలీస్‌ పెట్రోల్‌ కార్‌ మరియు పోలీస్‌ అధికారికి చెందిన మరో కార్‌ ధ్వంసమయ్యింది. అలాగే పోలీస్‌ స్టేషన్‌కి చెందిన ఫెన్స్‌ కూడా ధ్వంసమయ్యింది. ఫైర్‌ బాంబులు విసిరి ఈ దాడికి పాల్పడ్డారు ఆందోళనకారులు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com