పోలీసులపై దాడి: ముగ్గురికి జైలు
- October 28, 2016
మనామా: సుప్రీం అప్పీల్ కోర్ట్, ముగ్గురు వ్యక్తులకు విధింపబడిన పదేళ్ళ జైలు శిక్షను ఐదేళ్ళకు కుదించింది. కింది కోర్టు వారికి 10 ఏళ్ళు జైలు శిక్ష విధించగా, సుప్రీం అపీల్స్ కోర్ట్ ఆ శిక్షను ఐదేళ్ళకు కుదిస్తూ తీర్పునిచ్చింది. ఖామిస్ పోలీస్ స్టేషన్పై జరిగిన దాడిలో ఈ ముగ్గురినీ నిందితులుగా న్యాయస్థానం గుర్తించింది. పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు పోలీస్ స్టేషన్పై దాడి చేశారు. ఈ ఘటనలో ఆ ముగ్గురూ పాల్గొన్నట్లు పోలీసులు సాక్ష్యాలు సేకరించారు. ఈ దాడిలో పోలీస్ పెట్రోల్ కార్ మరియు పోలీస్ అధికారికి చెందిన మరో కార్ ధ్వంసమయ్యింది. అలాగే పోలీస్ స్టేషన్కి చెందిన ఫెన్స్ కూడా ధ్వంసమయ్యింది. ఫైర్ బాంబులు విసిరి ఈ దాడికి పాల్పడ్డారు ఆందోళనకారులు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







