50 మంది కార్మికులకు అందని వేతనాలు, వసతి సౌకర్యం

- October 29, 2016 , by Maagulf
50 మంది కార్మికులకు అందని  వేతనాలు, వసతి సౌకర్యం

మనామా:  డైర్ స్ట్రెయిట్స్ కాంట్రాక్టు కంపెనీకు చెందిన 50 మంది కార్మికులు తమకు సంబంధిత సంస్థ  వేతనాలు, వసతి సౌకర్యం కల్పించకుండా వెలుపలికి తోసివేశారని శుక్రవారం భారత రాయబార కార్యాలయ  సాయం కోరారు. అడ్లియా దౌత్యకార్యాలయం ప్రాంగణంలో శుక్రవారం ఉదయం జరిగిన ఓపెన్ హౌస్ కార్యక్రమంలో కార్మికులు పాల్గొని తమకు గత రెండు నెలల నుంచి వేతనాలు పొందడం లేదని  పేర్కొన్నారు.మేము ఇక్కడ చిక్కుకొన్నామని జీతాలు ఇంతవరకు రాలేదు. సంస్థ మమ్ముల్ని తిరిగి ఇంటికి పంపేందుకు విమాన టిక్కెట్లు ఏర్పాటు చేసేందుకు నిరాకరించారని మంకు అనే ఒక కార్మికుడు తన ఆవేదన వ్యక్తం చేసాడు. వారు చివరికి దౌత్యకార్యాలయం జోక్యం చేసుకున్న తర్వాత తమ తమ  పాస్పోర్ట్ తిరిగి లభించాయి  అని తెలిపారు. భారతదేశంలో ఉన్నఒక నియామక సంస్థ ఇక్కడ ఉద్యోగాలు ఉన్నాయని తమకు తెలిపిన తరువాత ఈ బహరేన్ కు  వచ్చినట్లు ప్రవాస కార్మికులు వెల్లడించారు. మేము నిర్విరామంగా ప్రయత్నిస్తున్నప్పటకీ మావద్ద ఏ డబ్బు లేదు, మాకు  మా జీతాలు పొందడానికి సహాయం ఎంతో అవసరం. మేము ఇకపై ఇక్కడ పని చేయాలనీ అనుకోవడం లేదని  తిరిగి భారతదేశం కు వెళ్లాలని ఆశ పడుతున్నట్లు  మా కంపెనీ లో మేనేజర్ మమ్ముల్ని తీవ్రంగా ఇబ్బందులు పెట్టాడు. అంతే కాకుండా ఎప్పటికప్పుడు మమ్ముల్ని  బెదిరించేవారని మంకు  చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com