50 మంది కార్మికులకు అందని వేతనాలు, వసతి సౌకర్యం
- October 29, 2016
మనామా: డైర్ స్ట్రెయిట్స్ కాంట్రాక్టు కంపెనీకు చెందిన 50 మంది కార్మికులు తమకు సంబంధిత సంస్థ వేతనాలు, వసతి సౌకర్యం కల్పించకుండా వెలుపలికి తోసివేశారని శుక్రవారం భారత రాయబార కార్యాలయ సాయం కోరారు. అడ్లియా దౌత్యకార్యాలయం ప్రాంగణంలో శుక్రవారం ఉదయం జరిగిన ఓపెన్ హౌస్ కార్యక్రమంలో కార్మికులు పాల్గొని తమకు గత రెండు నెలల నుంచి వేతనాలు పొందడం లేదని పేర్కొన్నారు.మేము ఇక్కడ చిక్కుకొన్నామని జీతాలు ఇంతవరకు రాలేదు. సంస్థ మమ్ముల్ని తిరిగి ఇంటికి పంపేందుకు విమాన టిక్కెట్లు ఏర్పాటు చేసేందుకు నిరాకరించారని మంకు అనే ఒక కార్మికుడు తన ఆవేదన వ్యక్తం చేసాడు. వారు చివరికి దౌత్యకార్యాలయం జోక్యం చేసుకున్న తర్వాత తమ తమ పాస్పోర్ట్ తిరిగి లభించాయి అని తెలిపారు. భారతదేశంలో ఉన్నఒక నియామక సంస్థ ఇక్కడ ఉద్యోగాలు ఉన్నాయని తమకు తెలిపిన తరువాత ఈ బహరేన్ కు వచ్చినట్లు ప్రవాస కార్మికులు వెల్లడించారు. మేము నిర్విరామంగా ప్రయత్నిస్తున్నప్పటకీ మావద్ద ఏ డబ్బు లేదు, మాకు మా జీతాలు పొందడానికి సహాయం ఎంతో అవసరం. మేము ఇకపై ఇక్కడ పని చేయాలనీ అనుకోవడం లేదని తిరిగి భారతదేశం కు వెళ్లాలని ఆశ పడుతున్నట్లు మా కంపెనీ లో మేనేజర్ మమ్ముల్ని తీవ్రంగా ఇబ్బందులు పెట్టాడు. అంతే కాకుండా ఎప్పటికప్పుడు మమ్ముల్ని బెదిరించేవారని మంకు చెప్పారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







