మెయిడ్ అబ్స్కాండింగ్: స్పాన్సర్లకు ఊరట
- October 29, 2016
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, కొత్త విధానం తీసుకు వచ్చేందుకు సన్నద్ధమయ్యింది. జనవరి 17 నుంచి అమల్లోకి రానున్న ఈ విధానం ద్వారా, స్పాన్సర్లకు ఊరట కలుగుతుంది. ఒప్పందాల్ని ఉల్లంఘించి, మెయిడ్స్ అబ్స్కాండింగ్లోకి వెళ్ళిపోవడం లేదా వారిపై కేసులు నమోదవడం వంటి సందర్భాల్లో స్పాన్సర్లకు సమస్యలొస్తున్నాయి ఇప్పటివరకూ. తిరుగు ప్రయాణంలో వారికి టిక్కెట్లు చెల్లించాల్సి వస్తోంది. అయితే ఇకపై అలాంటి కేసుల్లో తిరుగు ప్రయాణానికి టిక్కెట్లు ఇవ్వాల్సిన అవసరం స్పాన్సర్లకు ఉండదు. పారిపోయిన, కేసుల్లో ఇరుక్కున మెయిడ్స్కి అక్రమంగా అవకాశాలు కల్పించేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా ఈకొత్త విధానంలో వెసులుబాటు కల్పిస్తున్నారు. అబ్స్కాండ్ అయినవారిని పట్టుకుని, వారిని విచారించి, షెల్టర్ ఇచ్చినవారెవరో కనుగొని, వారిని కూడా శిక్షించేలా జనరల్ డిపార్ట్మెంట్ ఫర్ రెసిడెన్స్ ఎఫైర్స్ చర్యలు తీసుకుంటుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







