మెయిడ్ అబ్స్కాండింగ్: స్పాన్సర్లకు ఊరట
- October 29, 2016
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, కొత్త విధానం తీసుకు వచ్చేందుకు సన్నద్ధమయ్యింది. జనవరి 17 నుంచి అమల్లోకి రానున్న ఈ విధానం ద్వారా, స్పాన్సర్లకు ఊరట కలుగుతుంది. ఒప్పందాల్ని ఉల్లంఘించి, మెయిడ్స్ అబ్స్కాండింగ్లోకి వెళ్ళిపోవడం లేదా వారిపై కేసులు నమోదవడం వంటి సందర్భాల్లో స్పాన్సర్లకు సమస్యలొస్తున్నాయి ఇప్పటివరకూ. తిరుగు ప్రయాణంలో వారికి టిక్కెట్లు చెల్లించాల్సి వస్తోంది. అయితే ఇకపై అలాంటి కేసుల్లో తిరుగు ప్రయాణానికి టిక్కెట్లు ఇవ్వాల్సిన అవసరం స్పాన్సర్లకు ఉండదు. పారిపోయిన, కేసుల్లో ఇరుక్కున మెయిడ్స్కి అక్రమంగా అవకాశాలు కల్పించేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా ఈకొత్త విధానంలో వెసులుబాటు కల్పిస్తున్నారు. అబ్స్కాండ్ అయినవారిని పట్టుకుని, వారిని విచారించి, షెల్టర్ ఇచ్చినవారెవరో కనుగొని, వారిని కూడా శిక్షించేలా జనరల్ డిపార్ట్మెంట్ ఫర్ రెసిడెన్స్ ఎఫైర్స్ చర్యలు తీసుకుంటుంది.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









