తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో క్యాట్ బిర్యానీ...!

- October 31, 2016 , by Maagulf
తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో  క్యాట్ బిర్యానీ...!

చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ ఇలా రకరకాలుగా బిర్యానీలు చేస్తారని తెలుసు.  కానీ తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో పిల్లుల్ని చంపి వాటి మాంసంతో క్యాట్ బిర్యానీ చేసి వడ్డిస్తున్నారు.  ఈ అక్రమ బాగోతం చెన్నైలోని పల్లావరంలో వెలుగు చూసింది.  జంతు సంరక్షణకు చెందిన ఓ స్వచ్చంద సంస్థ వాలంటీర్లు, చెన్నై పోలీసులు కలిసి ఈ అక్రమాన్ని బట్టబయలు చేశారు.  క్యాట్ బిర్యానీ కోసం పిల్లుల్ని ఓ బోనులో బంధించి ఉంచారు. అయితే పోలీసులు దాడి చేసి వాటిని విడిపించారు.  పిల్లుల ప్రవర్తనను చూసిన పోలీసులు షాకయ్యారు.  ఆ పిల్లులు సాధారణ పిల్లుల్లా కాకుండా గోడపై బల్లి పాకినట్లు పాకుతున్నాయి.  ఇందుకు కారణం అవి కొన్ని నెలలుగా బోనులో బంధించడమే అని జంతు సంరక్షణ కారులు అంటున్నారు.  చెన్నైలో క్యాట్ బిర్యానీ అమ్మడం కొత్త కాదని గతంలో కూడా పలు హోటళ్ళలో ఇలాంటి బాగోతాలు వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలియజేశారు. ఏది ఏమైనా చెన్నై వెళితే సాంబర్ ఇడ్లీ తినండి కానీ, బిర్యానీ మాత్రం తినకండి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com