తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో క్యాట్ బిర్యానీ...!
- October 31, 2016
చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ ఇలా రకరకాలుగా బిర్యానీలు చేస్తారని తెలుసు. కానీ తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో పిల్లుల్ని చంపి వాటి మాంసంతో క్యాట్ బిర్యానీ చేసి వడ్డిస్తున్నారు. ఈ అక్రమ బాగోతం చెన్నైలోని పల్లావరంలో వెలుగు చూసింది. జంతు సంరక్షణకు చెందిన ఓ స్వచ్చంద సంస్థ వాలంటీర్లు, చెన్నై పోలీసులు కలిసి ఈ అక్రమాన్ని బట్టబయలు చేశారు. క్యాట్ బిర్యానీ కోసం పిల్లుల్ని ఓ బోనులో బంధించి ఉంచారు. అయితే పోలీసులు దాడి చేసి వాటిని విడిపించారు. పిల్లుల ప్రవర్తనను చూసిన పోలీసులు షాకయ్యారు. ఆ పిల్లులు సాధారణ పిల్లుల్లా కాకుండా గోడపై బల్లి పాకినట్లు పాకుతున్నాయి. ఇందుకు కారణం అవి కొన్ని నెలలుగా బోనులో బంధించడమే అని జంతు సంరక్షణ కారులు అంటున్నారు. చెన్నైలో క్యాట్ బిర్యానీ అమ్మడం కొత్త కాదని గతంలో కూడా పలు హోటళ్ళలో ఇలాంటి బాగోతాలు వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలియజేశారు. ఏది ఏమైనా చెన్నై వెళితే సాంబర్ ఇడ్లీ తినండి కానీ, బిర్యానీ మాత్రం తినకండి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







