'భారతీయ సినిమాను అంతర్జాతీయస్థాయికి తీసుకెళ్లేందుకు నిధి ఏర్పాటు..
- November 01, 2016
భారతీయ సినిమారంగానికి ఎనలేని ప్రోత్సాహాన్ని అందజేస్తున్నట్లు కేంద్ర సమాచార, ప్రసారాల శాఖామంత్రి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఈ నెల 20 నుంచి 28 వరకు జరగనున్న 47వ అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవం కర్టెన్రైజర్ కార్యక్రమం మంగళవారంనాడు జరిగింది. ఇందులో భాగంగా ఈ ఉత్సవానికి సంబంధించిన పోస్టర్ను విడుదలచేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎం.వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, 'భారతీయ సినిమాను అంతర్జాతీయస్థాయికి తీసుకెళ్లేందుకు ఓ నిధిని ఏర్పాటుచేస్తున్నాం. తాము తీసిన సినిమాలను అంతర్జాతీయస్థాయిలో తీసుకెళ్లాలని అనుకునేవారికి ఈ నిధి నుంచి సాయం అందించడం జరుగుతుంది. మన ఆలోచనలను ఇతరులకు, ఇతరుల ఆలోచనలను మనం పంచుకుని నాణ్యమైన మంచి సినిమాలను నిర్మించేందుకు ఓ మంచిఫ్లాట్ఫామ్ను తయారుచేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.మొత్తంమీద భారతీయ సినిమాకు ఎనలేని ప్రోత్సాహం అందిస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గోవా ఉప ముఖ్యమంత్రి ఫ్రాన్సిస్ డి.సౌజా, ఆ రాష్ట్ర మంత్రి రాజీవ్వర్ధన్రాథోర్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ.బాలుకు అవార్డుఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్-2016 అవార్డుకు ప్రముఖ గాయకులు ఎస్పీ.బాలసుబ్రహ్మణ్యం ఎంపికయ్యారు. గోవా అంతర్జాతీయ చిత్రోత్సవం ముగింపు వేడుకకు ముఖ్యఅతిథిగా ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి పాల్గొననున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







