'భారతీయ సినిమాను అంతర్జాతీయస్థాయికి తీసుకెళ్లేందుకు నిధి ఏర్పాటు..

- November 01, 2016 , by Maagulf
'భారతీయ సినిమాను అంతర్జాతీయస్థాయికి తీసుకెళ్లేందుకు  నిధి ఏర్పాటు..

భారతీయ సినిమారంగానికి ఎనలేని ప్రోత్సాహాన్ని అందజేస్తున్నట్లు కేంద్ర సమాచార, ప్రసారాల శాఖామంత్రి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఈ నెల 20 నుంచి 28 వరకు జరగనున్న 47వ అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవం కర్టెన్‌రైజర్‌ కార్యక్రమం మంగళవారంనాడు జరిగింది. ఇందులో భాగంగా ఈ ఉత్సవానికి సంబంధించిన పోస్టర్‌ను విడుదలచేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎం.వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, 'భారతీయ సినిమాను అంతర్జాతీయస్థాయికి తీసుకెళ్లేందుకు ఓ నిధిని ఏర్పాటుచేస్తున్నాం. తాము తీసిన సినిమాలను అంతర్జాతీయస్థాయిలో తీసుకెళ్లాలని అనుకునేవారికి ఈ నిధి నుంచి సాయం అందించడం జరుగుతుంది. మన ఆలోచనలను ఇతరులకు, ఇతరుల ఆలోచనలను మనం పంచుకుని నాణ్యమైన మంచి సినిమాలను నిర్మించేందుకు ఓ మంచిఫ్లాట్‌ఫామ్‌ను తయారుచేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.మొత్తంమీద భారతీయ సినిమాకు ఎనలేని ప్రోత్సాహం అందిస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గోవా ఉప ముఖ్యమంత్రి ఫ్రాన్సిస్‌ డి.సౌజా, ఆ రాష్ట్ర మంత్రి రాజీవ్‌వర్ధన్‌రాథోర్‌ తదితరులు పాల్గొన్నారు. 
ఎస్పీ.బాలుకు అవార్డుఇండియన్‌ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌-2016 అవార్డుకు ప్రముఖ గాయకులు ఎస్పీ.బాలసుబ్రహ్మణ్యం ఎంపికయ్యారు. గోవా అంతర్జాతీయ చిత్రోత్సవం ముగింపు వేడుకకు ముఖ్యఅతిథిగా ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి పాల్గొననున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com