స్టాక్ మార్కెట్ పతనం.. పెరిగిన బంగారం, వెండి ధర
- November 03, 2016
స్టాక్ మార్కెట్ పతనంఅమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో సర్వే ఫలితాల ప్రభావం
జిల్లాలో నష్టపోయిన మదుపుదారులు పెరిగిన బంగారం, వెండి ధరఅమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యం లో సర్వే ఫలితాల వెల్లడితో బుధవారం స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులకు గురైంది. పలు కంపెనీ షేర్లు పతనం కావడంతో పలువురు మదుపుదారులు నష్టపోయారు. మరోవైపు బంగారం, వెండి ధరలు పెరిగాయి. దీనితోపాటు అమెరికా అధ్యక్ష ఎన్నికల అనంతరం అక్కడ విద్యావకాశాలపై కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికాలో స్థిరపడిన వారి భవితవ్యంపై కూడా కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.తెలుగు రాష్ట్రాల నుంచి వందలాది మంది ఉపాధి, చదువుల కోసం అమెరికా వెళుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అమెరికా అధ్యక్ష ఎన్నికలపై జిల్లాలో ఆసక్తి నెలకొంది. కుప్పకూలిన స్టాక్ మార్కెట్ అమెరికా అధక్ష ఎన్నికలపై సర్వే ఫలితాలు బుధవారం స్టాక్ మార్కెట్ను షేక్ చేశాయి. సెస్సెక్స్ 360 పాయింట్లు నష్టపోయింది.ఆరంభం నుంచి మార్కెట్ లో ఇదే ట్రెండ్ కొనసాగింది. ఒక దశలో సూచిక 400 పాయింట్లు నష్టపోయి తరువాత కొద్దిగా రికవరీ అయింది. బ్యాంకింగ్తో పాటు అన్ని రంగాల షేర్లు భారీగా పతనం కావడంతో జిల్లాలోని మదుపుదారులు నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. రానున్న రోజుల్లో మార్కెట్ ఏ విధంగా ఉంటుందనే భయంతో పెట్టుబడులను అమ్ముకునేందుకు సిద్ధపడుతున్నారు.పెరిగిన బంగారం, వెండి నెల రోజులుగా స్థిరంగా ఉంటున్న బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. బంగారం పది గ్రాములకు రూ.500 పెరిగింది. కేజీ వెండి రూ.800 వరకు పెరిగింది. బుధవారం పది గ్రామాలు మేలిన బంగారం రూ 31,300 పలికింది.కేజీ వెండి రూ 44,400కు చేరింది. రానున్న రోజుల్లో బంగారం ధర మళ్లీ రూ.32వేలు దాటవచ్చన్న ఊహగానాలు మార్కెట్లో వినిపిస్తున్నాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







